|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మేడారం జాతరపై వేణుస్వామి షాకింగ్ వ్యాఖ్యలు: భక్తుల మనోభావాలు దెబ్బతీశారా?

Published: 15-12-2025, 3:08 PM
మేడారం జాతరపై వేణుస్వామి షాకింగ్ వ్యాఖ్యలు: భక్తుల మనోభావాలు దెబ్బతీశారా?
  • ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మేడారం జాతరపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • భక్తులు జంతుబలి, మద్యపానం చేస్తారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.
  • లక్షల మేకల బలి డబ్బుతో జూబ్లీహిల్స్ లో విల్లా కొనే అవకాశం ఉందంటూ వేణుస్వామి కామెంట్.
  • వేణుస్వామి వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను, తెలంగాణ వాసులను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మేడారం జాతరపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సినీ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మేడారం జాతరపై వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు. నిత్యం సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పిన వేణుస్వామి, అప్పటి నుంచి బాగా పాపులర్ అయిపోయారు. అయితే ఈ మధ్య జాతకాలు చెప్పడం తగ్గించిన వేణు స్వామి, సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటి మంది మేడారం జాతరకు వెళ్తారని వెల్లడించారు.

పండుగ సంప్రదాయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు

వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లిన వాళ్లే, మేడారం వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. మేడారం సమ్మక్క సారాలమ్మకు బంగారం ( బెల్లం) ఇచ్చిన తర్వాత, మేకలను కోసుకొని, మద్యపానం సేవిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక మేడారంలో కొన్ని లక్షల మేకలను బలిస్తారని వెల్లడించారు. ఆ జంతు బ‌లికి పెట్టిన‌ డబ్బులతో జూబ్లీహిల్స్ లో ఒక మంచి విల్లా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వేణు స్వామి బాంబు పేల్చారు.

తెలంగాణ వాదుల ఆగ్రహం, క్షమాపణల డిమాండ్

అలాగే లిక్కర్ బాటిల్లు కూడా విపరీతంగా మేడారం జాతరలో తాగుతారని కూడా వివరించారు. నాన్ వెజ్ తినే భ‌క్తులు వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి వ‌స్తార‌ని కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా, తెలంగాణ వాళ్లను తాగుబోతులు అని అర్థం వచ్చేలా వేణుస్వామి కామెంట్స్ చేశారని ఫైర్ అవుతున్నారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

వేణుస్వామి వ్యాఖ్యలపై తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన క్షమాపణ చెప్పకుంటే, ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ సంచలన అంశంపై ప్రజలు, సెలబ్రిటీల స్పందన వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.