
📌 Key Points
- విజయ్, రష్మిక పెళ్లికి హాజరైన అతిథుల కోసం ప్రత్యేకంగా పాండీ కూర!
- విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక బిసిబేళా బాత్ కూడా సిద్ధం!
- పెళ్లికి వచ్చిన గెస్టుల కోసం జపనీస్ వంటకాలను కూడా ఏర్పాటు చేసిన విరోష్ జంట.
- స్వీట్లు, డీజర్ట్ లతో ఫుల్ ఫుడ్ ఫెస్ట్ అరేంజ్ చేసిన విరోష్ వెడ్డింగ్.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. వీళ్ళ పెళ్లి విందులో స్పెషల్ ఐటమ్ ఏదో ఇప్పుడు చూద్దాం.
విరోష్ పెళ్లిలో అదిరిపోయే విందు భోజనం
wedding Menu: డ్రీమ్ వెడ్డింగ్ తో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటయ్యారు. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో వీళ్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లి విందులో ఓ ఐటెం హాట్ టాపిక్ గా మారింది.
స్పెషల్ పాండీ కూర.. కారణం ఇదే!
విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ మెనూలోని ఓ ఐటెం మరింత వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో విరోష్ వెడ్డింగ్ జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో అతిథులకు వడ్డించే విందులో పంది మాంసంతో చేసిన స్పెషల్ పాండీ కూర కూడా ఉందని సమాచారం.
విందులో తెలంగాణ, కర్ణాటక వంటకాలు!
ఇక విరోష్ పెళ్లి విందులో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేళా బాత్ కూడా అతిథుల కోసం సిద్ధం చేశారని సమాచారం. తమ పెళ్లికి వచ్చిన గెస్ట్ ల కోసం జపనీస్ వంటకాలను కూడా విరోష్ జోడీ రెడీ చేయించిందంటా. అలాగే స్వీట్లు, డీజర్ట్ లతో ఫుల్ ఫుడ్ ఫెస్ట్ అరెంజ్ చేశారని తెలిసింది.
విరోష్ పెళ్లి విందు గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


