
తెలుగు, బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటి ఆదా శర్మ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఫోటోల్లో ఆమె ఒంటి నిండా గాయాలతో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Key Points
ఆదా శర్మ తన ఇన్స్టాగ్రామ్లో గాయాలతో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ ఫోటోలు 'కాశ్మీరి ఫైల్స్' సినిమాకు సంబంధించినట్లు తెలుస్తోంది.
ఆదా శర్మ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్
హీరోయిన్ ఆదా శర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘హార్ట్ ఎటాక్’(Heart Attack) సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అయింది. దీంతో ఈ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుని దూసుకుపోతుందని అనుకున్నారంతా. అయితే ఆమెకు అనుకున్నంత క్లిక్ కాలేకపోయింది. ఆదా శర్మకు తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కలేదు. ఇదే సమయంలో సెకండ్ హీరోయిన్గా నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్గా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసి అక్కడ బాగానే ఆఫర్లు పట్టేసింది. తన టాలెంట్తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.
అభిమానుల ఆందోళన
ముఖ్యంగా ‘ది కేరళ స్టోరీ'(The Kerala Story) సినిమా ఈ భామకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్తో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గాయాలతో కనిపించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారగా.. ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా అవి కాశ్మీరి ఫైల్స్ మూవీలోని ఫొటోస్ అన్నట్లుగా తెలుస్తోంది.
కాశ్మీరి ఫైల్స్ సినిమాతో సంబంధం?
A post shared by Adah Sharma (@adah_ki_adah)
ఆదా శర్మ యొక్క గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది కాశ్మీరి ఫైల్స్ సినిమాకు సంబంధించినదేమోనని అనుమానం వ్యక్తమవుతోంది.


