
కోలీవుడ్ స్టార్ విజయ్ కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చిత్ర పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Key Points
కరూర్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొక్కిసలాటకు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ప్రేక్షకులు, మీడియా సహా అందరూ బాధ్యత వహించాలని అజిత్ పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మొత్తం చిత్ర పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కరూర్ తొక్కిసలాట: అసలేం జరిగింది?
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) ఇటీవల జనాలతో మాట్లాడేందుకు కరూర్లో ఓ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ర్యాలీలో జనం అధికంగా రావడంతో తొక్కిసలాట జరిగి 41మంతి ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటర దేశవ్యాప్తంగా దిగ్ర్భాంతికి గురి చేసింది. అలాగే దీనిపై కేసు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రా హైకోర్టును ఆశ్రయించింది. మొదట వ్యతిరేకించిన న్యాయస్థానం ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక సంఘటన జరిగిన సమయంలో విజయ్పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు విజయ్ని తప్పు పడుతూ పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా, కరూర్ తొక్కిసలాటపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘‘నేను ఎవరినీ తక్కువ చేయడానికి ప్రయత్నించడం లేదు. కానీ నేను చెప్పినట్లుగా ఈ రోజు తమిళనాడులో జరిగిన ఈ తొక్కిసలాట కారణంగా చాలా జరుగుతోంది. ఆ వ్యక్తి (విజయ్) ఒక్కడే బాధ్యత వహించడు, మనమందరం దీనికి బాధ్యత వహిస్తాము. మీడియా కూడా ఇందులో పాత్ర పోషించాలని నేను భావిస్తున్నాను. ఈ రోజు మనం జనాన్ని సేకరించి.. ఆ జనాన్ని టీవీల్లో చూపించడానికి చాలా నిమగ్నమై పోతామని నేను భావిస్తున్నాను. ఇదంతా అంతం కావాలి! అంటే మీకు క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్ళే జనం ఉన్నారు.
చిత్ర పరిశ్రమ ప్రతిష్టపై ప్రభావం
అక్కడ ఇదంతా జరగడం మీరు చూడరు కదా? థియేటర్లలో మాత్రమే ఎందుకు జరుగుతోంది? ఇది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులతో మాత్రమే ఎందుకు జరుగుతోంది? ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం చిత్ర పరిశ్రమను చెడుగా చూపిస్తుంది. నటుడు కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని, వారిని ఓదార్చిన తర్వాత ఎక్స్-గ్రేషియాను పంపిణీ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, రిలీఫ్ మొత్తాన్ని ముందుగా వారికి చేరేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు’’ అని అన్నాడు.
అజిత్ కుమార్ వ్యాఖ్యలు కరూర్ సంఘటనపై సినీ ప్రముఖులు, మీడియా, ప్రేక్షకులు బాధ్యత వహించాలనే చర్చను లేవనెత్తాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, చిత్ర పరిశ్రమకు చెడ్డపేరు రాకుండా చూడటం అందరి కర్తవ్యం.


