
📌 Key Points
- తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు.
- ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తన ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు.
- ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.
- ప్రజలు, రైతులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన.
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. జూలై 3వ తేదీ ఉదయం వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం, జిల్లాల వారీగా
ఏపీలోనూ రాబోయే 24 గంటల్లో వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది. రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్చరికలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మొత్తంగా, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండనుంది. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తతే ప్రమాదాల నుంచి రక్షణ.


