
📌 Key Points
- 2029 నాటికి రాష్ట్రంలో 50,000 హోటల్ గదులు, 10,000 హోమ్స్టేలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పం.
- పర్యాటక అభివృద్ధికి ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదన.
- విశాఖ, కృష్ణపట్నం పోర్టుల నుండి క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
- పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50,000 హోటల్ గదులు, 10,000 హోమ్స్టేలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు.
2029 నాటికి టూరిజంలో భారీ మార్పులు
ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50,000 హోటల్ గదులను, 10,000 హోమ్స్టేలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హోమ్స్టేల కోసం ఒక వ్యవస్థీకృత రేటింగ్ విధానం అవసరమన్నారు. పర్యాటక రంగంపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినూత్న పర్యాటక ఉత్పత్తులు, సృజనాత్మక నగర కార్యక్రమాల కలయికతో ఏపీ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రధాన గమ్యస్థానంగా ఆవిర్భవిస్తుంది.’ అని పేర్కొన్నారు.
రాష్ట్ర పర్యాటక రంగ కోసం భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినూత్న పర్యాటక కార్యక్రమాలపై ఉద్ఘాటిస్తూ ముఖ్యమంత్రి ఒక సమగ్ర వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
తీరప్రాంతంలోని ప్రాజెక్టులు, అరకు లోయ, మారేడుమిల్లి , చింతపల్లి వంటి పర్యావరణ పర్యాటక కేంద్రాలను ప్రధాన గమ్యస్థానాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు.
పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ఫ్యామిలీలకు ప్రకృతిని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరువ చేసేందుకు వీలుగా 10-15 ప్రదేశాలలో కారవాన్ పార్కులను ఏర్పాటు చేయడం, గోదావరి పుష్కరాల ద్వారా 1,000 కారవాన్ పార్క్, టెంట్ సిటీ యూనిట్లను సృష్టించడం కూడా ఈ ప్రణాళికలలో భాగంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అటవీ, దేవాదాయ శాఖల భాగస్వామ్యంతో పర్యావరణ, ఆలయ పర్యాటకాన్ని సమన్వయంతో ప్రోత్సహించడంతో పాటు తిరుపతి, విశాఖపట్నం లో అమ్యూజ్మెంట్ పార్కులను కూడా ప్రణాళిక చేస్తోంది ప్రభుత్వం. గాంధీకోట, సూర్యలంక బీచ్, బొర్రా గుహలు వంటి ప్రధాన పర్యాటక ఆకర్షణల వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా వేగవంతం కానుంది.
పర్యాటకుల రాకపోకలను సులభతరం చేసేందుకు గోదావరి పుష్కర్ ఘాట్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువులలో ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలు, వాటర్ ఏరోడ్రోమ్లతో సహా ఆధునిక పర్యాటక విధానాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టు నుండి క్రూయిజ్ టూరిజం కూడా ఎజెండాలో ఉందని చంద్రబాబు అన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కంటెంట్ క్రియేట్, సాంస్కృతిక పరిశ్రమలను ప్రోత్సహించే ఒక సృజనాత్మక నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. గతేడాది రాష్ట్రంలో 309.2 మిలియన్ల పర్యాటక సందర్శనలు నమోదయ్యాయని, ప్రస్తుత ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 21 శాతం వృద్ధి నమోదైందని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అవతరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.


