
📌 Key Points
- ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 14 పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకునే అవకాశం.
- రావులపాలెం డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సులో యాత్ర ప్రారంభం.
- 2026 మార్చి 20 నుంచి 28 వరకు 8 రోజుల టూర్ ప్యాకేజీ.
- టికెట్ ధర రూ.9900, వసతి ఛార్జీలు అదనం.
దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలను సందర్శించాలని అనుకుంటున్నారా? ఏపీఎస్ఆర్టీసీ 14 పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర రావులపాలెం డిపో నుంచి ప్రారంభమవుతుంది.
ఏపీఎస్ఆర్టీసీ పుణ్యక్షేత్రాల టూర్ వివరాలు
మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు సందర్శించి రావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తీసుకొచ్చింది. 14 పుణ్యక్షేత్రాల దర్శనం చేయించనుంది. అంతేకాదు ఈ లిస్టులో లిస్టులో అరుణాచలం, రామేశ్వరంవంటి ఆలయాలను దర్శనం చేసుకోవచ్చు.
కోనసీమ జిల్లాలోని రావులపాలెం డిపో నుంచి ఈ టూర్ మెుదలవుతుంది. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తారు. టీవీ సౌకర్యం కూడా ఉంటుంది.
టూర్ ప్యాకేజీలో ఉన్న పుణ్యక్షేత్రాలు
ఈ టూర్ 20-03-2026 నుంచి 28-03-2026 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. మెుత్తం 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఉదయం అల్పహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పహారం అందిస్తారు. టికెట్ ఛార్జీ రూ.9900గా నిర్ణయించారు. ఒకవేళ రూమ్స్ తీసుకుంటే ఛార్జీలు అదనం అని గమనించాలి.
మరిన్ని వివరాలకు, టికెట్ల కోసం అస్టిసెంట్ మేనేజర్ : 7382911871, టీసీహెచ్వీబీ రావు : 7382912400, ఆర్ఎస్ రావు : 7382912398, రావులపాలెం ఆర్టీసీ ఎంక్వాయిరీ : 9959225549.
టికెట్ ధర మరియు ఇతర వివరాలు
‘APSRTC రావులపాలెం డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ యాత్ర సర్వీసు. భక్తుల కోసం అరుణాచలం, రామేశ్వరం, మధురై, కాంచీపురం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు మొత్తం 14 ప్రసిద్ధ ఆలయాల దర్శనం కలిగిన ప్రత్యేక యాత్ర సర్వీసును నిర్వహించబడుతోంది.’ అని ఆర్టీసీ ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ భక్తులకు ఒక గొప్ప అవకాశం. తక్కువ ధరలో 14 పుణ్యక్షేత్రాలను సందర్శించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


