
📌 Key Points
- అరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్ ప్రవేశ టికెట్ ధరలు సగానికి పైగా తగ్గాయి.
- పెద్దలకు రూ.100 నుండి రూ.60కి, పిల్లలకు రూ.50 నుండి రూ.30కి ధరలు సవరించారు.
- గార్డెన్లో కొత్తగా టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యాయి, ‘కోయ్ వాటర్ డైనింగ్’ త్వరలో రానుంది.
- ప్రకృతి పర్యాటకాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. పద్మాపురం గార్డెన్ టికెట్ ధరలను తగ్గించడంతో పాటు, కొత్త ఆకర్షణలను ప్రవేశపెట్టింది. ఈ చర్యలు పర్యాటకుల రద్దీని పెంచి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
అరకు పర్యాటకంలో ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు లోయ(Araku Valley) సందర్శించే పర్యాటకులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అరకులోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పద్మాపురం బొటానికల్ గార్డెన్ ప్రవేశ టికెట్ ధరలను భారీగా తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు గార్డెన్ యాజమాన్యం సరికొత్త వసతులు, వినోదాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు పద్మాపురం గార్డెన్ ప్రవేశ రుసుములను సవరించారు. మునుపటి ధరలతో పోలిస్తే సగానికి పైగా రేట్లను తగ్గించడం విశేషం. గతంలో పెద్దలకు ఉన్న రూ.100 టికెట్ ధరను ఇప్పుడు రూ.60 కి తగ్గించారు. గతంలో ఉన్న పిల్లలకు ఉన్న రూ.50 టికెట్ ధరను ఇప్పుడు రూ.30 కి తగ్గించారు.
ప్రకృతి పర్యాటకాన్ని సామాన్య కుటుంబాలకు, విద్యార్థులకు, పర్యాటకులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
పద్మాపురం గార్డెన్: ధరల తగ్గింపు, నూతన ఆకర్షణలు
టికెట్ ధరల తగ్గింపుతో పాటు పద్మాపురం గార్డెన్లో సరికొత్త ఆకర్షణలు తోడయ్యాయి. జూన్ 12న ఈ గార్డెన్లో సరికొత్త టాయ్ ట్రైన్ సర్వీసును ప్రారంభించారు. ఇది ఇప్పటికే ఇక్కడికి వచ్చే చిన్న పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రీనరీ మధ్యలో ఈ రైలు ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది.
పర్యాటకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘కోయ్ వాటర్ డైనింగ్’ అనే ప్రీమియం రెస్టారెంట్ వసతిని త్వరలోనే ప్రారంభించనున్నారు. నీటి మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని భోజనం చేసేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. అరకు వచ్చే టూరిస్టులకు ఇది ఒక సరికొత్త లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది.
అరకు లోయ అభివృద్ధికి ప్రణాళికలు
అరుదైన వృక్షజాతులు, అందమైన తోటలతో బొటానికల్ గార్డెన్గా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న హ్యాంగింగ్ హట్స్(చెట్లపై ఉండే ఇళ్లు) పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆధునిక వసతులు, పర్యావరణ అనుకూల ఫీచర్లతో పద్మాపురం బొటానికల్ గార్డెన్ను అత్యుత్తమ నేచర్ రీక్రియేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ప్రభుత్వం తీసుకున్న ఈ పర్యాటక అభివృద్ధి చర్యలు అరకు లోయకు కొత్త శోభను తీసుకువస్తున్నాయి. టికెట్ ధరల తగ్గింపు, నూతన వసతులు పర్యాటకులను ఆకర్షించి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


