|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Banana Prices : అరటి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? రైతన్నలు ఏం అంటున్నారు?

Published: 18-04-2026, 1:05 AM
Banana Prices : అరటి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? రైతన్నలు ఏం అంటున్నారు?
  • పశ్చిమ ఆసియా ఎగుమతులపై ఉద్రిక్తతలు, మధ్యవర్తుల జోక్యంతో అరటి ధరలు పతనం.
  • పులివెందుల ప్రాంతంలో 25,000 ఎకరాల్లో అరటి సాగు విస్తరించి ఉంది.
  • రవాణా ఖర్చులు అధికంగా ఉండటంతో రైతులకు లాభాలు తగ్గిపోతున్నాయి.
  • మహారాష్ట్రలో ఉత్పత్తి పెరగడం వల్ల కడప అరటికి డిమాండ్ తగ్గింది.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పంట కోత సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరటి ధరల పతనానికి కారణాలు

పశ్చిమ ఆసియాలో ఎగుమతులపై నెలకొన్న ఉద్రిక్తతలు, మధ్యవర్తుల జోక్యం, ఏకకాలంలో పంట కోత, అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు వంటి ప్రపంచ, స్థానిక కారణాలతో అరటి రైతులు నష్టపోతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో టన్నుకు రూ. 18,000 నుంచి రూ. 27,000 మధ్య ధరలు పలికినప్పటికీ.. ఎగుమతి డిమాండ్ తగ్గడంతో మార్చి నుంచి ధరలు తీవ్రంగా పడిపోయాయి.

ఒక దశలో, ధరలు టన్నుకు రూ. 6,000-రూ. 9,000 కు పడిపోయాయి. తర్వాత ధరలు సుమారు రూ. 10,000 – రూ. 11,000 వరకు స్వల్పంగా కోలుకున్నప్పటికీ రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అరటి సాగులో పులివెందుల ప్రాంతం ఎక్కువ వాటాను కలిగి ఉంది. దాదాపు 25,000 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇతర ప్రాంతాలలో 8 నుండి 10 రోజులతో పోలిస్తే.. ఈ ప్రాంతపు అరటి పండ్లు వాటి నాణ్యతకు పెట్టింది పేరు. 12 నుండి 14 రోజుల పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

ఇక్కడ నుంచి సగటున ప్రతిరోజూ 1,000 టన్నులకు పైగా అరటిపండ్లు ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్ వంటి నగరాలకు, అలాగే హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. అరబ్ దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయి. ప్రతిరోజూ 10 నుండి 16 ట్రక్కుల లోడ్లు వెళ్తాయి. ప్రతి ట్రక్కు 20 నుండి 25 టన్నుల సరుకును తీసుకువెళుతుంది. ఇది ముంబై ఓడరేవులకు చేరడానికి ముందు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుంది.

రైతుల రవాణా ఖర్చుల భారం

ఉత్పత్తి బాగా ఉన్నా.. అధిక రవాణా ఖర్చులు లాభాలను తగ్గిస్తున్నాయి. రైతులు 20 టన్నుల రవాణాకు రూ. 80,000 నుండి రూ. 1.1 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే కిలోకు రూ. 6-8 చొప్పున ఖర్చవుతోంది. దీనితో పోలిస్తే, మహారాష్ట్ర రైతులకు కిలోకు కేవలం రూ. 2-3 మాత్రమే ఖర్చవుతోంది. మహారాష్ట్ర నుండి ముందుగానే అరటి రావడం కడప ఉత్పత్తులకు డిమాండ్‌ను మరింత బలహీనపరిచింది.

కొనుగోలుదారులు లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో పంట అమ్ముడుపోకుండా పొలాల్లోనే కుళ్లిపోతోందని రైతులు అంటున్నారు. ఎకరానికి సాగు ఖర్చులు రూ. 1.5 లక్షలకు చేరుకుంటుండగా, 15-20 టన్నుల దిగుబడిని ఆశిస్తున్న తరుణంలో ప్రస్తుత ధరలతో నష్టాలో ఉన్నాయని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వ సహాయం కోసం రైతుల ఎదురుచూపులు

ఎగుమతులకు అంతరాయం కలగడం, మహారాష్ట్రలో ఉత్పత్తి పెరగడం అనే రెండు కారణాల వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రైతులు మాత్రం ఇంకా అనుమానంగానే ఉన్నారు. ధరలను తగ్గించడానికి మధ్యవర్తులు అంతర్జాతీయ అంశాలను సాకుగా చూపుతున్నట్టుగా చెబుతున్నారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. డిమాండ్ పెరిగితే ధరలు మెరుగుపడవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.