
బిగ్ బాస్ కన్నడ సీజన్ 12లో తీవ్ర కుల వివాదం రాజుకుంది. కంటెస్టెంట్లు అశ్వినీ గౌడ, జాన్వీలు సహచర కంటెస్టెంట్ రక్షిత శెట్టిని ‘ఎస్టీ’ పేరుతో అవమానించారు. ఈ ఘటనపై వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం బిగ్ బాస్ హౌస్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Key Points
బిగ్ బాస్ కన్నడ సీజన్ 12లో కుల వివాదం హాట్టాపిక్గా మారింది.
అశ్వినీ గౌడ, జాన్వీలు రక్షిత శెట్టిని 'ఎస్టీ' అంటూ అవమానించారు.
ఆమె కమ్యూనికేషన్ స్టైల్, డ్రెస్సింగ్పై కూడా విమర్శలు చేశారు.
ఈ ఘటనపై ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ కన్నడలో కుల దూషణ
బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 హై టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతుంది. కిచ్చా సుదీప హోస్టింగ్ అదరగొడుతుండగా.. వీకెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కారణం కంటెస్టెంట్స్ అశ్వినీ గౌడ, జాన్వీలకు క్లాస్ పీకుతుంటే ఎంజాయ్ చేసేందుకు.. రక్షిత శెట్టిని టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో చూసేందుకు. ఇంతకీ ఏం జరిగిందంటే.. హౌజ్లో అక్టోబర్ 16న అశ్విని, జాన్వీలతో రక్షితకు పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత నామినేషన్స్ గురించి చర్చించుకునేటప్పుడు వీరిద్దరు.. రక్షిత కమ్యూనికేషన్ స్టైల్, కన్నడ భాషా నైపుణ్యం, డ్రెసింగ్ వంటి విషయాల్లో ఎటాక్ చేశారు.
‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటిదానివో తెలుస్తుంది. ఎస్ కేటగిరీ’ అంటూ ఆమెను షెడ్యూల్డ్ ట్రైబ్ పేరుతో అవమానించారు. నీ డ్రామాలు బాత్రూమ్లోనే ఉండనివ్వు అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను అసలు ఎలా భరిస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కంటెస్టెంట్ల మధ్య గొడవ, అవమానం
ఫ్యాన్స్, ఆడియన్స్ ఆగ్రహం
బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఈ కుల దూషణ ఘటన ఆడియన్స్ను నివ్వెరపరిచింది. ఇలాంటి వివక్షను ప్రోత్సహించడం సరికాదని, హోస్ట్ కిచ్చా సుదీప్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి. ఈ వివాదం హౌస్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది.


