|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బీహార్‌లో విషాదం: ఆలయంలో తొక్కిసలాట, ప్రధాని మోడీ స్పందన!

Published: 31-03-2026, 6:45 AM
బీహార్‌లో విషాదం: ఆలయంలో తొక్కిసలాట, ప్రధాని మోడీ స్పందన!
  • బీహార్‌లోని నలందా జిల్లాలో శీతల మాత ఆలయంలో తొక్కిసలాట, 8 మంది మృతి.
  • చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
  • ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
  • గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో గల శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట – 8 మంది దుర్మరణం

బీహార్‌లోని నలందా జిల్లా మఘ్రా గ్రామంలో ఉన్న ప్రముఖ దేవాలయం అయిన శీతల మాత ఆలయం (Shitala Mata Temple)లో తొక్కిసలాట జరిగిని ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు ఊపిరి ఆడక కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మహిళలేనని అధికారులు ధ్రువీకరించారు. మరో 12 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అలాగే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అండగా ఉండేందుకు పీఎంఆర్‌ఎఫ్ (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, భక్తుల రద్దీని నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, అదనపు బలగాల మోహరింపు

ఈ ఘటన బాధాకరమని ప్రధాని మోడీ అన్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.