
📌 Key Points
- వేసవిలో మజ్జిగ తాగడం భారతీయ సంప్రదాయంలో శతాబ్దాలుగా వస్తున్న ఆచారం.
- మజ్జిగలో ప్రోబయోటిక్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలం.
- జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మజ్జిగకు దూరంగా ఉండాలి.
- మజ్జిగలోని చలువ చేసే గుణం వల్ల కొంతమందిలో శ్వాసకోశ అసౌకర్యం పెరిగే ప్రమాదం ఉంది.
వేసవిలో మజ్జిగ తాగడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, మజ్జిగ అందరికీ మంచిది కాదని, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మజ్జిగ: వేసవిలో అమృతం లాంటిది
Buttermilk Side Effects : వేసవి కాలంలో మజ్జిగ తాగడం అనేది భారతీయ గృహాలలో శతాబ్దాల కాలంగా వస్తున్న ఒక అద్భుతమైన సాంప్రదాయం. మండుతున్న ఎండల్లో భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు చల్లని మజ్జిగ తాగితే లభించే ఉపశమనం, తాజాదనం మాటల్లో చెప్పలేం. అందుకే వేడి వాతావరణం ప్రారంభం కాగానే ప్రజలు తమ దైనందిన ఆహారంలో మజ్జిగను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుంటారు.
మజ్జిగ కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా.. ఇందులో శరీరానికి కావలసిన ప్రోబయోటిక్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అనేక రకాల ముఖ్యమైన విటమిన్లు నిండి ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను చురుగ్గా ఉంచడానికి మరియు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటానికి సహాయపడతాయి.
మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
అమృతం లాంటి గుణాలున్న ఈ మజ్జిగ ప్రతి ఒక్కరికీ మరియు అన్ని సమయాల్లోనూ ఒకేలా సరిపోతుందని చెప్పలేం. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులలో మజ్జిగ వినియోగం వల్ల అసౌకర్యం మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు… ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జలుబు లేదా గొంతు సమస్యలు: ఎవరికైనా తీవ్రమైన జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగను తీసుకోకపోవడమే మంచిది. మజ్జిగకు ఉన్న చలువ చేసే గుణం వల్ల కొంతమందిలో ఈ శ్వాసకోశ అసౌకర్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఎవరు మజ్జిగ తాగకూడదు? జాగ్రత్తలు
మజ్జిగ అనేది వేసవి తాపాన్ని తగ్గించడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రకృతి అందించిన అత్యంత ఆరోగ్యకరమైన పానీయం. అయినప్పటికీ…. ప్రతి ఒక్కరి శరీర తత్వం, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, పైన పేర్కొన్న నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించడం మంచిది. నిర్దిష్టమైన సమాచారం కోసం… ఆరోగ్య నిపుణుడి సలహాలు, సూచనలను తెలుసుకోవచ్చు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మజ్జిగ వేసవిలో అద్భుతమైన పానీయం అయినప్పటికీ, ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరు. కాబట్టి, పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సరైన సమాచారం కోసం ఆరోగ్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.


