|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేతనాలు పెంచాలని సినీ కార్మికుల డిమాండ్.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో దిల్ రాజు భేటీ.. నిర్మాతలు కూడా

Published: 12-08-2025, 12:20 AM
వేతనాలు పెంచాలని సినీ కార్మికుల డిమాండ్.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో దిల్ రాజు భేటీ.. నిర్మాతలు కూడా

తెలుగు సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు డిమాండ్‌తో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 30% వేతన పెంపు కోసం కార్మికులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో, దిల్ రాజు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు.

Key Points

1

సినిమా కార్మికులు 30% వేతన పెంపు డిమాండ్ చేస్తున్నారు.

2

దిల్ రాజు, సినీ నిర్మాతలు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు.

4

చిరంజీవి వేతన పెంపుపై తన ప్రమేయాన్ని ఖండించారు.

కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్

ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా పరిణామాల నేపథ్యంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం కార్యదర్శి రవిగుప్తా సహా సినీ నిర్మాతలతో కలిసి మంత్రితో సమావేశమయ్యారు దిల్ రాజు .

తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ‘‘నైపుణ్యం లేని కార్మికులకు చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న కనీస వేతనాల కంటే చాలా ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. దశాబ్దాలుగా తమ సభ్యులతో కలిసి పనిచేస్తున్న ఫెడరేషన్ తీసుకున్న ఈ చర్యను చాంబర్ ఖండిస్తోంది’’ అని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.

మంత్రితో దిల్ రాజు, నిర్మాతల భేటీ

వేతనాలు పెంచాలనే డిమాండ్ తో సినీ కార్మికుల నిరసనతో షూటింగ్ లకు బ్రేక్ రావడం సినిమాలకు నష్టం చేసేదే. త్వరగా సమస్యను పరిష్కరించేలా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాల మంత్రులతో సినీ ప్రముఖులు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని దిల్ రాజు సహా సినీ ప్రముఖులు కలిశారు. ఈ భేటీలో కార్మికుల డిమాండ్ తదితర సమస్యలను ప్రస్తావించినట్లు తెలిసింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వివాదంలో తన ప్రమేయం ఉందన్న ఆరోపణలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులుగా చెప్పుకునే వ్యక్తులు నిరసన తెలుపుతున్న కార్మికులను కలిసి వారి డిమాండ్లపై హామీలు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు.

చిరంజీవి ప్రకటన

”ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి వాళ్లను కలిశానని అంటున్నారు. 30 శాతం వేతన పెంపు తదితరాలకు సంబంధించి తమ డిమాండ్లను నెరవేరుస్తామన్నానని చెప్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని వాళ్లు నాకు హామీ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. నేను ఫెడరేషన్ నుంచి ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ సమస్య అని, నాతో సహా ఏ వ్యక్తీ ఏదో ఒక విధంగా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఏకపక్ష హామీలు ఇవ్వలేరని నేను సూటిగా చెప్పాలనుకుంటున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

‘‘ఫిల్మ్ ఛాంబర్ అనేది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అత్యున్నత సంస్థ అని, ఒక సమిష్టిగా ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సంబంధిత అందరితో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారానికి వస్తుంది. అప్పటి వరకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. భాగస్వాములందరిలో గందరగోళం సృష్టించడానికి ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత వాదనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి’’ అని చిరు అన్నారు.

సినిమా కార్మికుల వేతన పెంపు సమస్యపై చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం ఆశించదగినది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.