
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం గుంటూరులో విలేకరుల సమావేశంలో సినీ నటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ మసాలా వంటి హానికార పదార్థాల ప్రకటనల్లో నటించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Key Points
సీపీఐ నారాయణ సినీ నటులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పాన్ మసాలా ప్రకటనల్లో నటించడం సరికాదని నారాయణ అభిప్రాయం.
యువతను తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా నారాయణ నిరసన.
పాన్ మసాలా తయారీ కేంద్రాలను సీజ్ చేయాలని డిమాండ్.
నారాయణ సంచలన వ్యాఖ్యలు
సినీ నటులపై(Movie Actors) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ‘నో డ్రగ్స్’ ప్రచార కార్యక్రమం మంచిదేనని, అయితే గుట్కా, పాన్ పరాగ్, ఖైని వంటి వాటిని నిషేధించాలన్నారు. దేశంలో రూ.10కే ప్రమాదకరమైన పాన్ మసాలాలు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పాన్ మసాలాలను సినీ నటుడు ప్రమోట్ చేయడం సరికాదు. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యువతను తప్పుడు దారిలో పంపే ప్రకటనల్లో సినీ నటులు పాల్గొనటం, అలా డబ్బులు సంపాదించుకోవడం బాగోలేదు. ఇకనుంచైనా అలాంటి ప్రకటనలు చేయకపోవడం మంచిది. వెంటనే పాన్ మసాలా తయారీ కేంద్రాలను సీజ్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
పాన్ మసాలా ప్రకటనలు
యువతపై ప్రభావం
చివరగా, సినీ నటులు సామాజిక బాధ్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని, యువతను తప్పుదారి పట్టించే ప్రకటనలకు దూరంగా ఉండాలని నారాయణ పిలుపునిచ్చారు. పాన్ మసాలా వంటి హానికార పదార్థాలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.


