|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డైరెక్టర్‌పై క్రష్‌, చూడ్డానికి వెళితే హీరోయిన్‌గా సెలక్టై ఇప్పుడు ఇండియా నెంబర్‌ వన్‌గా రాణిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా?

Published: 07-07-2025, 11:52 PM
డైరెక్టర్‌పై క్రష్‌, చూడ్డానికి వెళితే హీరోయిన్‌గా సెలక్టై ఇప్పుడు ఇండియా నెంబర్‌ వన్‌గా రాణిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా?

సినిమా ప్రపంచంలో అనుకోని విజయాల కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక అద్భుత కథ సమంతది. దర్శకుడిపై క్రష్ తో ఆడిషన్ కి వెళ్లిన సమంత ఎలా ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయ్యిందో తెలుసుకుందాం.

Key Points

1

దర్శకుడిపై క్రష్ తో ఆడిషన్ కి వెళ్ళిన సమంత

2

అనుకోకుండా హీరోయిన్ గా ఎంపికైన సమంత

4

ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత

సమంత యొక్క అనుకోని విజయం

సినిమా ఒక మిరాకిల్‌. ఒక మ్యాజిక్‌. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోవచ్చు, ఓవర్‌నైట్‌లో అడ్రస్‌ లేకుండా వెళ్లిపోవచ్చు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.

అది టాలెంట్‌తోపాటు లక్‌ మీద కూడా ఆధారపడి ఉంటుందని అంటుంటారు. చాలా వరకు అలానే జరుగుతుంది. హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఓ హీరోయిన్‌ కి ఊహించని లక్‌ వరించింది.

దర్శకుడిపై క్రష్‌తో ఆమె ఆడిషన్‌కి వెళ్లింది. దర్శకుడిని చూడ్డానికి ఆడిషన్‌కి వెళితే హీరోయిన్‌ ఎంపికై, ఇప్పుడు ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.

హీరోయిన్‌ కావాలని ఎప్పుడూ తాను ఊహించలేదు, హీరోయిన్‌గా సెలక్ట్ అవుతానని తాను భావించలేదు, ఆ దర్శకుడిని చూస్తే చాలు అనుకున్నది.

ఏకంగా ఆయన దర్శకత్వంలోనే సినిమా చేసే ఛాన్స్ అందుకుంది. తొలి చిత్రంతోనే హిట్‌ అందుకుని స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అదే సమయంలో ఆడియెన్స్ ని మాయ చేసింది. ఆమె ఎవరో కాదు సమంతనే.

‘ఏం మాయ చేసావె’ సినిమా ప్రయాణం

`ఏం మాయ చేసావె` చిత్రంతో సమంత హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో తన ఎంపిక చాలా విచిత్రంగా జరిగిందట.

సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు గౌతమ్‌ మీనన్‌ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలంటే పిచ్చి. తను ఎలా ఉంటాడో చూద్దామని ఆడిషన్‌కి వెళ్లిందట. కానీ అనూహ్యంగా హీరోయిన్‌గా ఎంపికైనట్టు చెప్పింది సమంత.

`ఏం మాయ చేసావె` సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసింది. ఆడిషన్‌కి వెళితే ఆ దర్శకుడిని కలిసే అవకాశం వస్తుందని సమంత భావించింది. ఆయన్ని చూసి వస్తే చాలు అనుకుందట.

హీరోయిన్ అవ్వాలని, తాను సెలక్ట్ కావాలని అస్సలు ఊహించలేదు. తన మైండ్‌ లో కూడా లేదు. కానీ ఆడిషన్‌ చేశాక హీరోయిన్‌గా ఎంపికయ్యావని చెప్పారట.

దెబ్బకి షాక్‌ అయినట్టు చెప్పింది సమంత. `ఏం మాయ చేసావె` రిలీజ్‌ తర్వాత సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇండియా నెంబర్ వన్ హీరోయిన్

సమంత `ఏం మాయ చేసావె` తర్వాత స్టార్‌ అయిపోయింది. తెలుగులో అందరు హీరోలతోనూ నటించింది. నాగచైతన్యతో ఐదు సినిమాలు చేసింది. ఆయనతో ప్రేమలో పడింది.

2017 అక్టోబర్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా నాలుగేళ్లకే 2021లో విడిపోయారు. ఈ ఇద్దరు విడిపోవడానికి స్పష్టమైన కారణాలేంటనేది తెలియదు. ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన సమంత..

దాన్నుంచి కోలుకుంటుంది. ఏడాది సినిమాలకు బ్రేక్‌ తీసుకుని ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో ప్రతి నెల సమంతనే టాప్‌లో ఉంటుంది. ఆమెకి ఇండియా వైడ్‌గా ఉన్న క్రేజ్‌ అలాంటిది.

ఇక ఇటీవల సమంత నిర్మాతగానూ మారింది. `శుభం` అనే చిత్రాన్ని నిర్మించి హిట్‌ అందుకుంది. మరోవైపు బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నట్టు, వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సమంత యొక్క విజయం సినిమా రంగంలో అదృష్టం, కష్టపడి పనిచేయడం రెండింటినీ తెలియజేస్తుంది. ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.