|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ఆఫర్: యుద్ధంతో కుప్పకూలిన బంగారం ధరలు! దుబాయ్‌లో దిమ్మతిరిగే డిస్కౌంట్లు!

Published: 07-03-2026, 9:05 AM
షాకింగ్ ఆఫర్: యుద్ధంతో కుప్పకూలిన బంగారం ధరలు! దుబాయ్‌లో దిమ్మతిరిగే డిస్కౌంట్లు!
  • దుబాయ్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి.
  • ఔన్స్ బంగారంపై సుమారు రూ.2500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
  • భారత్‌కు బంగారం సరఫరా నిలిచిపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి.
  • యుద్ధం కొనసాగితే భారత్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.

దుబాయ్‌లో ఊహించని విధంగా బంగారం ధరలు పతనమయ్యాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా డిస్కౌంట్ ధరకు బంగారం లభిస్తోంది. అయితే, దీని ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందో చూడాలి.

దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు

డిస్కౌంట్ ధరకే బంగారం వస్తే ఎలా ఉంటుంది.. జనాలు ఎగబడి కొంటారనడంలో సందేహం లేదు. బంగారానికి కేరాఫ్ అడ్రస్ అయిన దుబాయ్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. దుబాయ్ వ్యాప్తంగా ఊహించని ఆఫర్లు వెలుగుజూస్తున్నాయి. యుద్ధం కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విమానాలు, నౌకల రవాణా పూర్తి నిలిచిపోయింది. దీంతో బంగారం ఎగుమతి, దిగుమతి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔన్స్ బంగారంపై 30 డాలర్ల వరకు తగ్గిపోయింది. భారత కరెన్సీ ప్రకారం రూ.2500 డిస్కౌంట్ లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్, ఇరాన్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌ను కుదిపేస్తోంది. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి.. కానీ విచిత్రంగా ప్రపంచపు ‘గోల్డ్ హబ్’గా పేరొందిన దుబాయ్‌లో మాత్రం బంగారం ధరలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

గల్ఫ్ దేశాల యుద్ధం కారణంగా దుబాయ్ నుండి ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు బంగారం సరఫరా చేసే విమానాలు రద్దు కావడంతో నిల్వలు పేరుకుపోయాయి. లండన్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే దుబాయ్ వ్యాపారులు ప్రస్తుతం ఔన్సుపై సుమారు $30 (సుమారు ₹2,500) వరకు తగ్గింపు ఇస్తున్నారు. నిల్వ ఖర్చులు, ఫైనాన్స్ వడ్డీల భారాన్ని తగ్గించుకోవడానికి వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాలు లేకపోవడంతో సౌదీ అరేబియా లేదా ఒమన్ మీదుగా రోడ్డు మార్గంలో బంగారాన్ని తరలించేందుకు వ్యాపారులు సాహసించడం లేదు. సరిహద్దుల వద్ద భద్రతా పరమైన రిస్క్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశానికి దుబాయ్ అతిపెద్ద బంగారం సరఫరాదారు అనే విషయం అందరికీ తెలిసిందే. జనవరి నెలలో భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకున్నందున, ప్రస్తుతం దేశీయంగా తగినంత స్టాక్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ యుద్ధం మరికొన్ని నెలల పాటు కొనసాగితే మాత్రం భారత్‌లో సరఫరా కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉంది.

భారత్‌కు బంగారం సరఫరాలో అంతరాయం

భారత్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం?

దుబాయ్‌లో బంగారం ధరలు తగ్గినా, యుద్ధం కొనసాగితే మాత్రం భారత్‌లో కొరత ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.