
📌 Key Points
- గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలు, మనోజ్, రవి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తారు – తండ్రి ఆగ్రహం!
- తల్లిదండ్రులను ఆంటీ, అంకుల్ అని పిలిచిన కొడుకులు! సత్యం వారిని శిక్షించడంతో కథనం రసవత్తరంగా మారుతుంది.
- మోసం చేసినందుకు మనోజ్ను 50 లక్షలు డిమాండ్ చేసిన ముఖేష్ – కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం కావడం హాట్ టాపిక్!
- గడప దగ్గర బాలు, మీనా సరసాలు – రాత్రి ఏం జరిగిందో మనోజ్కు చెప్పడంతో ఉత్కంఠ రేపుతున్న గుండె నిండా గుడి గంటలు!
గుండె నిండా గుడి గంటలు సీరియల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాగుబోతు కొడుకులకు తండ్రి శిక్ష వేయడంతో కథనం ఆసక్తికరంగా మారింది. మనోజ్ను ముఖేష్ కోర్టుకు లాగడంతో ఏం జరుగుతుందో చూడాలి.
తాగిన మైకంలో కొడుకులు రచ్చ రచ్చ!
Gunde Ninda Gudi Gantalu Serial March 20th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్లో బాగా తాగి వచ్చి తల్లిదండ్రులను ఆంటీ, అంకుల్ అని పిలుస్తారు బాలు, మనోజ్, రవి. దాంతో వారికి శిక్ష వేస్తాడు సత్యం. ఇంటికి వచ్చిన ముఖేష్ మోసం చేసినందుకు మనోజ్ను 50 లక్షలు డిమాండ్ చేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు, మనోజ్, రవి ముగ్గురు తాగి ఇంటి ముందు ఒక్కటిగా గోల చేస్తారు. బాలును మామ అంటాడు రవి. తల్లిని పట్టుకుని ఆంటీ అని, మనింట్లో ఎందుకు ఉంది అని రవి అంటాడు.
ఇలాగే వాగితే వీళ్లేవరో మాకు తెలియదని పోలీసులను పిలిచి అప్పగిస్తాను అని సత్యం వార్నింగ్ ఇస్తాడు. దాంతో ముగ్గురు సైలెంట్గా ఉంటారు. లోపలికి రానివ్వొచ్చుగా అని శ్రుతి అంటుంది. మీ మంచికోసమే చెబుతున్నా. ఇదే శిక్ష. తెల్లవారితే ఇదంతా మర్చిపోతారు అని సత్యం అంటాడు. బాలును ఉంచి మనోజ్, రవిని లోపలికి రమ్మనండని ప్రభావతి అంటుంది.
మనోజ్కు ముఖేష్ భారీ షాక్!
వీడే చెడగొట్టి ఉంటాడని ప్రభావతి అంటుంది. రోహిణి చెప్పు అని మీనా అంటుంది. బాలు కంట్రోల్లోనే ఉన్నాడు. మనోజే బలవంతం చేశాడని నిజం చెబుతుంది రోహిణి. మనోజ్ ఒక్కడిని లోపలికి రమ్మనండని ప్రభావతి అంటే.. వాడి మీద జాలిపడితే నిన్ను కూడా బయటకు పంపిస్తా. నోర్మూసుకుని పదా అని సత్యం అంటాడు. తర్వాత ఆ ముగ్గురి మీద జాలి చూపిస్తే ఊరుకోను అని సత్యం ఆర్డర్ వేస్తాడు.
మనోజ్ కోట్లో ఉన్న ఫోన్ కొట్టేద్దామని రోహిణి కిందకు వస్తే.. అక్కడ మీనా ఉండటంతో తిరిగి వెళ్లిపోతుంది. బాలుకు ఎక్కిళ్లు రావడంతో మీనాను పిలుస్తాడు. మీనా వాటర్ బాటిల్ ఇస్తుంది. తాను గడప దాటనని మీనా అంటే.. నేను మా నాన్న గీసిన గీత దాటనంటాడు బాలు. తనకు మందు దిగిందని, కోట్ విప్పి టీ షర్ట్ వేసుకుంటానని బాలు అంటాడు.
గడప దగ్గర బాలు, మీనా ముచ్చట్లు!
మీతో మావయ్య మాట్లాడొద్దన్నాడని, తెల్లార్లు దోమలతో భజన చేయండని మీనా అంటుంది. ఇంట్లో మీనా.. బయట బాలు ఇద్దరు గడప దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. మనోజ్ మీద ప్రేమ చూపిస్తాడు బాలు. తర్వాత ఈరోజు రెడీ అయ్యావుగా కత్తిలా ఉన్నావంటాడు బాలు. తర్వాత ప్రాస చెబితే కవిత్వమా అని మీనా అంటుంది. కాదు మందిత్వం, మందు తాగినవాడు చెబితే మందిత్వం అని బాలు అంటాడు.
ఎవరి భర్తను వారు లేపుతారు. మనం బయట ఉన్నామేంటీ అని మనోజ్ అడుగుతాడు. రాత్రి జరిగింది మనోజ్కు చెబుతారు బాలు, రవి. లోపలికి రమ్మని సత్యం అంటాడు. సత్యం, ప్రభావతిని నాన్న, అమ్మా అని పిలిస్తే మేము అంకుల్, ఆంటీ కదా అని చురకలు వేస్తారు. అంతగా ఎలా తాగారు అని మీనా, శ్రుతి అంటే.. మనోజ్ వైపు చూస్తూ వీడే ముంబై ముఖేష్ కోసం బలవంతం చేశాడని బాలు, రవి చెబుతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. సత్యం నిర్ణయం ఏమిటి? ముఖేష్ ఏం చేయబోతున్నాడు? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే! మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


