
📌 Key Points
- చిరంజీవి సినిమా ఈ ఏడాది రిలీజ్ కాలేదు; `విశ్వంభర` ఆలస్యం, వచ్చే సంక్రాంతికి `మన శంకరవరప్రసాద్ గారు`.
- మహేష్ బాబు 2023లో `గుంటూరు కారం` తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ; 2027 వరకు విడుదల లేదు.
- అల్లు అర్జున్ ఈ ఏడాది కొత్త సినిమా చేయలేదు; అట్లీ దర్శకత్వంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్గా సినిమా.
- ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ చరణ్, నాగార్జున, ప్రభాస్, నాని వంటి పలువురు హీరోలు ఈ ఏడాది సందడి చేశారు.
ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద అనేక మంది స్టార్ హీరోలు సందడి చేశారు. అయితే, చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి కొందరు అగ్ర తారలు మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేకపోయారు. ఈ ఏడాది వారి సినిమాలు ఎందుకు విడుదల కాలేదు, వారి తదుపరి ప్రాజెక్ట్లు ఏమిటో తెలుసుకుందాం.
చిరంజీవి: ఈ ఏడాది ఎందుకు మిస్సయ్యారు?
ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు వచ్చి బాక్సాఫీసు వద్ద తమ సత్తాని చాటారు. ఎన్టీఆర్ `వార్ 2`తో, వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం`తో, రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`తో, నాగార్జున `కూలీ`, `కుబేర` చిత్రాలతో, ప్రభాస్ `కన్నప్ప`, నాని `హిట్ 3`లో, రవితేజ `మాస్ జాతర`, `మిస్టర్ బచ్చన్`, విజయ్ దేవరకొండ `కింగ్డమ్`తో చిత్రాల్లో కనిపించారు. యంగ్ హీరోలు కూడా చాలా వరకు తమ సినిమాలతో అలరించారు. బాలకృష్ణ ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. మరి ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా అలరించని హీరోలు ఎవరో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా కనిపించని హీరోలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ కాక రెండేళ్లు అవుతుంది. 2023లో `భోళా శంకర్`తో వచ్చారు. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత `విశ్వంభర` చిత్రంలో నటించారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. వచ్చే సమ్మర్లో రాబోతుంది. అంతకంటే ముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మన శంకరవరప్రసాద్ గారు` మూవీతో రాబోతున్నారు. ఇది ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటించడం విశేషమైతే, వెంకటేష్ గెస్ట్ గా మెరవబోతుండటం విశేషం. ఇలా ఈ ఏడాది చిరు తన అభిమానులను నిరాశ పరిచారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
మహేష్ బాబు: రాజమౌళి ప్రాజెక్ట్తో బిజీ
ఇదే దారిలో మహేష్ బాబు ఉన్నారు. ఆయన చివరగా గతేడాది `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్. ప్రస్తుతం ఆయన `వారణాసి`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ 2027లో విడుదల కాబోతుంది. అంటే ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా మహేష్ అభిమానులను నిరాశ పర్చబోతున్నారని చెప్పొచ్చు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది ఒక్క మూవీలో కూడి నటించలేదు. ఆయన చివరగా `పుష్ప 2`తో అలరించారు. ఇది వచ్చే ఏడాది డిసెంబర్లోనే విడుదలైంది. దీంతో ఈ ఏడాది ఆయన రాలేదనే ఫీలింగ్ లేకుండా నడిచిపోయింది. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బన్నీ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది రిలీజ్ కావడానికి కూడా మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అంటే బన్నీ ఏ ఏడాదిలోనే కాదు, వచ్చే ఏడాది కూడా కనిపించడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్: అట్లీ సినిమాతో రాబోతున్న బన్నీ
అలాగే మరో స్టార్ హీరో గోపీచంద్ కూడా ఈ ఏడాది ఆడియెన్స్ ని అలరించలేకపోయారు. ఆయన గతేడాది `భీమ`, `విశ్వం` చిత్రాల్లో నటించాడు. కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. త్వరలో ఆయన ఓ హిస్టారికల్ కథతో రాబోతున్నారు. ఇందులో వారియర్గా గోపీచంద్ కనిపించబోతున్నారు. దీనికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. వీరితోపాటు శర్వానంద్, అఖిల్ కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరంతా వచ్చే ఏడాది సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.
నిజానికి డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది `కన్నప్ప`లో కాసేపు మెరిశారు. `బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్తో మెప్పించారు. కానీ తాను సోలో హీరోగా నటించిన ఒక్కమూవీ కూడా విడుదల కాలేదు. ఇప్పుడు `ది రాజాసాబ్`లో నటిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది.
ఈ ఏడాది కొందరు స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే, వచ్చే ఏడాది వీరందరూ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లతో డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వారి రాక కోసం ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


