
📌 Key Points
- భారత్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్ విజయం.
- భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది, 246 పరుగులకే పరిమితమైంది.
- సంజూ శాంసన్ (89), శివమ్ దూబే (43) రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
- భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు విలవిల, ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది.
టీ20 ప్రపంచకప్లో భారత్ తన సత్తా చాటింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది.
సెమీ ఫైనల్లో భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా 253 పరుగుల లక్ష్యం పెట్టినా.. ఎక్కడా బెదరకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా అదగొరట్టారు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందా? లేదా? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. మొత్తంగా 254 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేసింది. దీంతో భారత్ వరల్డ్ కప్ ఫైనల్కు వెళ్లింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెతెల్ సెంచరీతో(105) చెలరేగినా ఫలితం లేకుండా పోయంది. విల్ జాక్స్ (35), జాస్ బట్లర్ (25), బాంటన్ (17), సామ్ కరణ్ (18), ఆర్చర్ (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బూమ్రా, వరుణ్, అక్షర్ తలో వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43) రాణించడంతో స్కోరు ఏకంగా 253 పరుగులకు చేరింది. కెప్టెన్ సూర్య కుమార్ (11), అభిషేక్ శర్మ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా ఇతర ప్లేయర్లు అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరును అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ రెండు వికెట్లు, ఆదిల్ రషిద్ రెండు వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ తీశారు.
భారత బ్యాటర్ల మెరుపులు
ఫైనల్కు చేరిన భారత్
మొత్తానికి, ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో రాణించడం ద్వారా జట్టు సమష్టిగా ఆడింది. ఈ విజయంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.


