|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మా సినిమా ఆ కోవకి చెందుతుంది : జేడీ చక్రవర్తి (‘జాతస్య మరణం ధ్రువం’)

Published: 06-09-2025, 1:51 AM
మా సినిమా ఆ కోవకి చెందుతుంది : జేడీ చక్రవర్తి ('జాతస్య మరణం ధ్రువం')

‘జాతస్య మరణం ధ్రువం’ సినిమా గురించి నటుడు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సినిమా మలయాళ సినిమాల తరహాలో ఉంటుందని, అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ మరియు ఇతర నటులు ఈ సినిమాలో నటించారు.

Key Points

1

జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ నటించిన చిత్రం 'జాతస్య మరణం ధ్రువం'.

2

మలయాళ సినిమాల తరహాలో అద్భుతమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

4

పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబడిన ఈ చిత్రం అదే స్థాయిలో విడుదల కానుంది.

‘జాతస్య మరణం ధ్రువం’ సినిమా విశేషాలు

‘‘జాతస్య మరణం ధ్రువం’ పేరు సజెస్ట్‌ చేసింది నేనే. టైటిల్‌ క్రెడిట్‌ నాకే వస్తుంది (నవ్వుతూ). మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయని అంటాం. మా ‘జాతస్య మరణం ధ్రువం’ ఆ కోవకి చెందిన సినిమా… అందరికీ నచ్చుతుంది’’ అని జేడీ చక్రవర్తి తెలిపారు. శ్రవణ్‌ జొన్నాడ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, నరేశ్‌ అగస్త్య, సీరత్‌ కపూర్, ప్రీతీ జంగియాని ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు.

ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరేశ్‌ అగస్త్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే, ట్విస్టులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘చాలా బలమైన స్క్రిప్ట్‌ ఇది. ఇన్వెస్టిగేషన్‌ పార్ట్‌ అద్భుతంగా ఉంటుంది’’ అని శ్రవణ్‌ జొన్నాడ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని సీరత్‌ కపూర్‌ చెప్పారు. మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘΄ాన్‌ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన ఈ సినిమాని అదే స్థాయిలో విడుదల చేస్తాం’’ అని తెలి΄ారు.

నటులు, దర్శకుల అభిప్రాయాలు

సినిమా విడుదల వివరాలు

మొత్తంగా ‘జాతస్య మరణం ధ్రువం’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బలమైన కథాంశం, నటనతో ఈ సినిమా విజయవంతం అవుతుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.