|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ విమర్శలు చాలా వేదనకు గురిచేస్తున్నాయి: కయాదు లోహర్‌

Published: 19-11-2025, 9:50 PM
ఆ విమర్శలు చాలా వేదనకు గురిచేస్తున్నాయి: కయాదు లోహర్‌

నటి కయాదు లోహర్‌పై ఇటీవల వస్తున్న విమర్శలు ఆమెను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన కయాదు, తనపై జరుగుతున్న టార్గెటింగ్‌పై స్పందించారు. ఈ విమర్శలు తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆమె వివరించారు, తన సినిమాల గురించి కూడా పంచుకున్నారు.

Key Points

1

నటి కయాదు లోహర్‌ను విమర్శలు తీవ్రంగా బాధిస్తున్నాయి.

2

కయాదు పాన్ ఇండియా నటిగా వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

4

ఆమె అధర్వ, జీవీ ప్రకాష్, శింబు, ధనుష్‌తో సినిమాలు చేయనున్నారు.

నటి కయాదు లోహర్‌పై విమర్శల దాడి

నటీనటులు ప్రశంసలనే  కాదు విమర్శలను ఎదుర్కోక తప్పదు. అలా అభినందనలకు ఉప్పొంగేవారు, విమర్శలను మాత్రం తట్టుకోలేరు. ఇది వాస్తవం. ఇప్పుడు నటి కయాదు లోహర్‌ పరిస్థితి కూడూ ఇలాంటిదే. 2021లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కన్నడం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాళీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమిళంలో నటించిన డ్రాగన్‌ చిత్రానికి ముందు ఈ భామకు అంత పేరు లేదు. ఎప్పుడైతే ప్రదీప్‌ రంగనాథ్‌తో డ్రాగన్‌ చిత్రంలో నటించారో అప్పటి నుంచి ఒక్క సారిగా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు.

పాన్ ఇండియా నాయికిగా కయాదు ప్రస్థానం

ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక నటి బరువుపై జరిగిన చర్చలో తలదూర్చిన కయాదు లోహర్‌పై కూడా విమర్శలు రావడం మొదలెట్టాయి. దీంతో తనను టార్గెట్‌ చేస్తున్నారని ఈ అమ్మడు వాపోతున్నారు. దీని గురించి కయాదు లోహర్‌ ఓ యూట్యూట్‌ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో తన గురించి జరుగుతున్న విమర్శలు చాలా వేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తానని అన్నారు. తన గురించి వెనుక విమర్శించినా బాధపడకపోయినా అది తనను వేధిస్తూనే ఉంటుందన్నారు. అసలు తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

కయాదు లోహర్ భవిష్యత్ ప్రాజెక్టులు

కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటుడు అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి అనే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా జీవీ ప్రకాశ్‌కు జంటగా ఆమ్మార్టల్‌ అనే చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా నటుడు శింబు సరసన ఒక చిత్రంలో నటించనున్నారు.అదే విధంగా నటుడు దనుష్‌కు జంటగా నటించనున్న చిత్రానికి లబ్బర్‌ బంతు చిత్రం ఫేమ్‌ తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటూ కన్నడం, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రంలో నటిస్తున్నారు.

విమర్శల నుండి వేదనకు గురవుతున్నప్పటికీ, కయాదు లోహర్ తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియా నటిగా ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తూ, తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.