📌 Key Points
- జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజుల హనుమాన్ జయంతి జాతర ప్రారంభం
- సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం
- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాలపై ఆంక్షలు
- 1000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల హనుమాన్ చిన్న జయంతి జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కొన్ని రోజుల కిందటి నుంచే ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు, పాదయాత్రగా కూడా కొందరు వస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుంకుంటున్నారు. క్యూ లైన్లు హనుమాన్ దీక్షా స్వాములతో నిండిపోయాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాల విరమణలు కూడా జరుగుతున్నాయి.
41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టు కు చేరుకుని.. అంజన్నకు ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. జైశ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. కొండగట్టు లో వెలసిన అంజన్నా.. నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్తిమయ్యా అంటూ స్వాములు పాటలు పాడుతున్నారు. కొండగట్టు కేసరి వర్ణంగా మారిపోయింది.
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. కొండగట్టుపై వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరం నిఘా పెడుతున్నారు.
మరోవైపు బుధవారం కోనేరు సమీపంలోని కళ్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరి కూలిపోవడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. పందిరి కింద ఉన్న భక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. నాసిరకం పనుల కారణంగానే పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపించారు.
భారీ గాలుల కారణంగా పందిరిలో కొంత భాగం ఒరిగిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ కార్యనిర్వాహక అధికారి అంజనా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు 1000 మంది పోలీసు సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భారీగా భద్రతా ఏర్పాట్లు
ప్రధాన ద్వారం, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలతో సహా ఆలయ ప్రాంగణంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి, కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సందడి నెలకొంది. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.


