
📌 Key Points
- కేటీఆర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై బీజేపీ, కాంగ్రెస్లను నిలదీశారు.
- ‘బేటీ బచావో’ నినాదంపై ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.
- బాధితురాలిపై ఎదురు కేసులు పెట్టడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
- తెలంగాణలో ‘జంగిల్ రాజ్’ అని కేటీఆర్ అభివర్ణించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘బేటీ బచావో’ నినాదంపై బీజేపీని, బాధితురాలికి అన్యాయంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కేసులో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ప్రశ్నలు: ‘బేటీ బచావో’ కేవలం నినాదమేనా?
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితురాలికి జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మీ ‘బేటీ బచావో’ అనేది కేవలం ఒక నినాదానికే పరిమితమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్తరఫ్ ఎప్పుడు చేస్తారో చెప్పాలి అన్నారు. కేంద్రమంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. లేక బండి సంజయ్, ఆయన కొడుకుకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అని అడిగారు. నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? లేదా ఆయనను మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మహిళపై అత్యాచారం జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం కేసు నమోదు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ఒక జంగిల్ రాజ్గా మారిపోయింది అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజం
‘మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పోలీస్ శాఖ ఎందుకు స్పందించలేదు? ఎప్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు మూడు నెలల పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఉన్నావ్ కేసులో బాధితురాలికి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బాధితురాలికి అండగా నిలబడరా? లేక మీ న్యాయం తెలంగాణ బాధితులకు వర్తించదా?.’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “ఏ నిబంధన ప్రకారం ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారు?” అని పోలీసులను నిలదీశారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా చూస్తూ వేధించడం దుర్మార్గమన్నారు. న్యాయం కోసం తిరుగుతూ ఆ బాలిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఆమెనే నిందిస్తూ విక్టిమ్ షేమింగ్ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఫ్రాంచైజీలా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో రెండు పార్టీలు కలిసి ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇతర పోక్సో కేసు నిందితుల మాదిరిగా మంత్రి కుమారుడిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
బాధితురాలికి అన్యాయం: కేటీఆర్ ఆవేదన
‘మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఈ ఘటనను చూస్తే అర్థమవుతోంది. గతంలో మన మహిళల గౌరవం కోసం అణచివేతదారులపై, ప్రభుత్వాలపై పోరాడాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు పోరాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం.’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మహిళా భద్రత, న్యాయం విషయంలో రెండు ప్రధాన పార్టీల తీరును కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


