|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్, బెంగళూరు రియల్ ఎస్టేట్‌కు లేఆఫ్స్ షాక్: టెక్కీల కలలు చెదిరిపోతున్నాయా?

Published: 01-04-2026, 7:05 AM
హైదరాబాద్, బెంగళూరు రియల్ ఎస్టేట్‌కు లేఆఫ్స్ షాక్: టెక్కీల కలలు చెదిరిపోతున్నాయా?
  • ఒరాకిల్ ఒక్కసారిగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో కలకలం.
  • లేఆఫ్ ల కారణంగా ఐటీ నిపుణులు తమ పెట్టుబడులను పునఃసమీక్షించుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం.
  • AI కోడింగ్ ఏజెంట్ల కారణంగా తక్కువ ఖర్చుతోనే పని పూర్తవుతుండటంతో ఐటీ కంపెనీలకు ముప్పు వాటిల్లే అవకాశం.
  • భారీగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి.

ఒరాకిల్ 30 వేల మంది ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ లేఆఫ్స్ ప్రభావంతో ఐటీ నిపుణులు పెట్టుబడులను పునఃసమీక్షించుకుంటున్నారు. ఇది హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

లేఆఫ్స్‌తో ఐటీ నిపుణుల్లో ఆందోళన

టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle Layoffs 2026) మంగళవారం ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఊచకోత రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు భారతదేశంలోని టెక్ హబ్‍లలో కొత్త భయాందోళనలు రేకెత్తిస్తోంది. కంపెనీలు అనుసరిస్తున్న లేఆఫ్ ల కారణంగా ఐటీ నిపుణులు తమ భారీ పెట్టుబడులను పున:సమీక్షించుకుంటున్నారని తద్వారా రియల్ ఎస్టేట్ (Real Estate) రంగంపై తీవ్ర ప్రభావం పడబోతున్నట్లు బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం

రెండు దశాబ్దాలుగా భారత్‍లో నెక్స్ట్ లెవల్ గా దూసుకుపోయిన భారత ఐటీ సెక్టార్ వృద్ధి వేగంగా ఇటీవల నెలకొన్న పరిణామలతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒరాకిల్ ఇండియా తరహా పరిణామాలు ఇతర కంపెనీల్లోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశంలోని ఐటీ నగరాలపై తీవ్ర ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగంలో వచ్చిన ఆదాయం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ (Hyderabad Real Estate), పూణే, ఎన్ సీఆర్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం బలపడటాని వెన్నెముకగా నిలిచింది. కానీ తాజా లే ఆఫ్ లతో ఈ పరిస్థితులు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో భారీ ధరలు పెట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఇప్పుడు తమ ఈఎంఐలను చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు రేపు తమకు కూడా ఇదే పరిస్థితి రావొచ్చనే భయంతో తమ నిర్ణయాలను వాయిదా వేసుకునే అవకాశాలు ఉండనుంది.

AIతో ఐటీ కంపెనీలకు ముప్పు?

ఐటీ రంగంలో వస్తున్న పెనుమార్పులు ఇప్పుడు సామాన్యుడి సొంతింటి కలపై కోలుకోలేని దెబ్బ తీస్తుండగా ఏఐ ప్రభావం ఐటీ రంగాన్ని మరింత ఆందోళనలోకి నెట్టుతోంది. ఆటోమేషన్ వల్ల ఐటీ కంపెనీల రాబడిలో 2 నుంచి 3 శాతం తగ్గుదల ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేసింది. 2026లో ఇప్పటివరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 25 శాతం పడిపోయింది. గతంలో అమెరికా డెవలపర్ల కంటే భారతీయ డెవలపర్లు తక్కువ శాలరీలకే లభిస్తారనే ఆలోచనలతో ఐటీ కంపెనీలు నడిచాయి. కానీ ఇప్పుడు AI కోడింగ్ ఏజెంట్లు విద్యుత్ ఖర్చుతోనే పని పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలకు ముప్పు పొంచి ఉందని ‘సిట్రిని రీసెర్చ్’ నివేదిక హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్ ఎలా ఉండబోతోంది? తద్వారా ఆ రంగంలోని ప్రభావం ఇతర రంగాలపై ఎలా పడబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

మొత్తానికి, ఐటీ రంగంలో వస్తున్న మార్పులు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. టెక్కీలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.