
📌 Key Points
- లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇకలేరు; సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం!
- 92 ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూసిన ఆశా భోస్లే
- 20కి పైగా భాషల్లో వేల పాటలు పాడిన గొప్ప గాయని ఆశా భోస్లే
- సోమవారం ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోస్లే అంత్యక్రియలు
భారతీయ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం! లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారు కన్నుమూశారు. ఆమె మరణం సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతిని కలిగించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దిగ్గజ గాయని ఆశా భోస్లే కన్నుమూత
Asha Bhosle : భారతదేశ దిగ్గజ గాయని, పద్మ విభూషణ్, లతా మంగేష్కర్ సోదరి ఆశా భోస్లే కన్నుమూశారు. దీంతో భారతదేశ సంగీత పరిశ్రమలో ఒక శకం ముగిసింది అంటూ అభిమానులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఆశా భోస్లే 92 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో నిన్న రాత్రి ముంబయిలోని బ్రీచ్క్యాండీ హాస్పిటల్ లో చేర్చారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూనే నేడు ఏప్రిల్ 12న మధ్యాహ్నం మరణించారు. నిన్నటి నుంచి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వార్తలు రావడంతో ఆమె కోలుకోవాలని అంతా కోరుకున్నారు. నేడు ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తల్లి మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు.
సంగీత పరిశ్రమలో ఒక శకం ముగిసింది
ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో కొన్ని వేల పాటలతో శ్రోతలను మెప్పించింది. ఆశా భోస్లే మరణంతో బాలీవుడ్ తో సహా అన్ని పరిశ్రమలలో విషాదం నెలకొంది. అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు, రాజకీయ, మిగతా రంగాల ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
రేపు ముంబైలో ఆశా భోస్లే అంత్యక్రియలు
ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
ఆశా భోస్లే గారి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


