
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 నుంచి 8వ వారంలో మాధురి ఎలిమినేట్ అయ్యారు. మూడు వారాలకే రూ. 9 లక్షల భారీ రెమ్యునరేషన్ అందుకున్న ఆమె, ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. హౌస్లో ఆమె ప్రయాణం, ప్రేక్షకుల స్పందనపై పూర్తి వివరాలు ఇక్కడ.
Key Points
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 నుంచి 8వ వారంలో మాధురి ఎలిమినేట్ అయ్యారు.
కేవలం మూడు వారాలకే ఆమెకు రూ. 9 లక్షల భారీ రెమ్యునరేషన్ లభించింది.
అందుకున్న మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని మాధురి ప్రకటించారు.
హౌస్లో ముక్కుసూటి మనిషిగా పేరుపొందిన మాధురి పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
బిగ్బాస్ నుంచి మాధురి ఎలిమినేషన్
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ( Bigg Boss Telugu) నుంచి 8 వ వారంలో మాధురి ( Madhuri) ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అందరికంటే ఆమెకు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు . నామినేషన్స్లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. అయితే , వీరిలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్ మధ్య లాస్ట్ వరకు గట్టి పోటీ నెలకొంది. . కానీ , ఫైనల్గా మాధురి ఎలిమినేట్ అయ్యారు. అయితే , బిగ్ బాస్ నుంచి మాధురికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది .
సేవా కార్యక్రమాలకు రెమ్యునరేషన్ బిగ్ బాస్ హౌస్లో మాధురి కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు . కానీ , చాలా బలంగానే తన మార్క్ వేశారు . అసలైన ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో పేరు పొందారు . తన మాటలతో పాటు ఆటలోనూ సత్తా చాటారు . మాధురికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్ బాస్ కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది . కేవలం మూడు వారాలకే రూ . 9 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం . ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఆమె నిలిచారు . అయితే , ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని ఆమె ఇప్పటికే ప్రకటించారు . వికలాంగులు, క్యాన్సర్ రోగుల కోసం తమ వంతు సాయంగా ఈ డబ్బులు వితరణ చేస్తామన్నారు . ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించారు .
సేవా కార్యక్రమాలకు మాధురి రెమ్యునరేషన్
మాధురికి హౌస్ లోకి వెళ్లక ముందే చాలా ట్రోలింగ్ కు గురయ్యారు . తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె చుట్టూ అనేక వివాదాలు ఉండటంతో నెటిజన్లు ఆమెను ఇష్టపడలేదు . ఆమెను ఎందుకు సెలక్ట్ చేశారంటూ బిగ్ బాస్ టీమ్ ను కూడా తప్పుబట్టారు . అయితే , హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా ముక్కుసూటి మనిషి అంటూ చాలామంది కామెంట్లు చేయడం విశేషం . తనకు అనిపించిన విషయం ఏదైనా సరే బహిరంగంగానే చెబుతారని పేరు పొందారు . తన గేమ్లో ఎప్పుడూ కూడా నిజాయితీ కోల్పోలేదని చాలామంది కామెంట్ల రూపంలో తెలిపారు .
సోషల్ మీడియాలో ఆమె పట్ల మిశ్రమ స్పందనలు కూడా కనిపించాయి. ఆమె నిజాయితీకి, ధైర్యానికి కొందరు మద్దతు ఇస్తే .. మరికొందరు ఆమె అగ్రెసివ్ తీరు వల్లే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు . విపరీతమైన నెగటివిటీతో హౌస్ లోకి అడుగుపెట్టిన మాధురి .. బిగ్ బాస్ షో వల్ల దానిని కాస్త తగ్గించుకున్నారని చెప్పవచ్చు . ఈ సీజన్ లో చాలా పాపులర్ కంటెస్టెంట్ గా మాధురి పేరు ఎప్పటికీ ఉండిపోయేలా తన గేమ్ తో చూపించారని ఎక్కువ మంది చెప్పడం విశేషం .
హౌస్లో మాధురి వివాదాస్పద ప్రయాణం
నాకు ముందే తెలుసు : మాధురి హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతానని తాను ముందే అనుకున్నట్లు స్టేజీపై నాగార్జునతో మాధురి పంచుకున్నారు . నవంబరు 4 తన భర్త పుట్టినరోజు కాబటట ఇ ఆయన వద్ద ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే , తనకు బిగ్బాస్ ఎంతో నేర్పిందని మాధురి పేర్కొన్నారు. హౌస్ లో తనకు తనూజ అంటే చాలా ఇష్టమని తెలిపారు . ఆమె చాలా స్వీట్ అంటూ కితాబు ఇచ్చారు . తనూజ సీరియల్లో చేసినట్లు నటిస్తోందని అందరూ అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు . తరువాత కల్యాణ్ ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయతీగా ఆడుతున్నాడని చెప్పిన మాధురి .. డిమోన్ పవన్ కూడా చాలా స్వీట్ అంటూనే మంచి అబ్బాయని పేర్కొన్నారు . హౌస్లో 100శాతం ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి మాత్రమేనని చివరిగా తెలిపారు .
మాధురి బిగ్బాస్ ప్రయాణం అనూహ్యంగా ముగిసినప్పటికీ, ఆమె పొందిన భారీ రెమ్యునరేషన్, దానిని సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం ప్రశంసనీయం. ఆమె వ్యక్తిత్వంపై మిశ్రమ స్పందనలు ఉన్నా, ఆమె నిర్ణయం అనేకమందిని ఆకట్టుకుంది.


