
📌 Key Points
- విశాల్ నటించిన ‘మకుటం’ ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా పడింది.
- “పాటకు మరికొంత శ్రద్ధ, ప్రేమ అవసరం” అని టీమ్ సంచలన పోస్ట్ చేసింది.
- ఈ మధుర గీతం ఇప్పుడు జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ విశాల్ ‘మకుటం’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా ఫస్ట్ సింగిల్ వాయిదా ప్రకటన అభిమానులను షాక్కి గురి చేసింది. అయితే, ఈ వాయిదా వెనుక ఉన్న ఆసక్తికర కారణం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ!
‘మకుటం’ ఫస్ట్ సింగిల్ వాయిదా వెనుక అసలు కథ!
కోలీవుడ్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం ‘మగుడం’. తెలుగులో ఈ మూవీ ‘మకుటం’ పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు అప్డేట్స్తో సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడగా.. ఇటీవల టీజర్ను విడుదల చేసి సినిమాపై హైప్ను పెంచేశారు చిత్ర బృందం. ఇప్పుడు అదే జోష్తో తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈరోజు (జూన్ 16) విడుదల చేయబోతున్నట్లు ఓ స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చెయ్యగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ వాయిదా పడినట్లు మరో నోట్ షేర్ చశారు. ఈ మేరకు ‘ప్రియమైన మిత్రులారా.. ‘మగుడం/ మకుటం’ చిత్రం నుండి మొదటి పాటను ఈరోజే విడుదల చేయాలని అనుకున్నాము. అయితే, కొన్నిసార్లు ఒక పాట ప్రపంచం ముందుకు వచ్చే ముందు దానికి మరికొంత శ్రద్ధ, ప్రేమ అవసరమవుతాయి.. అందుకే మా ఈ మొదటి పాట విడుదల వాయిదా వేయబడింది. ఇది ఇప్పుడు జూన్ 19న విడుదల కానుంది’ అంటూ తెలిపారు. కాగా.. ఆర్ బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
విశాల్ టీమ్ ఇచ్చిన సంచలన వివరణ!
జూన్ 19న మ్యూజికల్ ట్రీట్ రెడీ!
‘మకుటం’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై మరింత హైప్ పెంచింది. విశాల్ అభిమానులు, సంగీత ప్రియులు జూన్ 19 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరింత సంచలన అప్డేట్ల కోసం వేచి ఉండండి!


