
📌 Key Points
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించారు.
- రామచందర్ రావు ఆమె రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని ఆరోపించారు.
- ఆర్టికల్ 172 ప్రకారం సీఎం పదవీ కాలం ఐదేళ్లేనని స్పష్టం చేశారు.
- మే 7 తర్వాత మమతా బెనర్జీ సీఎం పదవికి అనర్హురాలని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆమె రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ, మే 7 తర్వాత ఆమె పదవి కోల్పోతారని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మమతా బెనర్జీపై రామచందర్ రావు విమర్శలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేస్తూ.. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ప్రవర్తనపై రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ ఉత్కంఠ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramachandra Rao) ఘాటుగా స్పందించారు. గత 15 ఏళ్లుగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మమతా బెనర్జీ, ఇప్పుడు స్వయంగా రాజ్యాంగాన్ని ధిక్కరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా, రాజీనామా చేయనని భీష్మించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఆర్టికల్ 172 ప్రకారం ముఖ్యమంత్రి పదవీ కాలం ఐదేళ్లు మాత్రమేనని, ఆ గడువు ముగియగానే పదవి నుంచి వైదొలగాల్సిందేనని రామచందర్ రావు స్పష్టం చేశారు. అలాగే ఆర్టికల్ 164 ప్రకారం అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీ నేతను ముఖ్యమంత్రిగా నియమించే అధికారం గవర్నర్కు ఉంటుందని తెలిపారు. మమతా బెనర్జీ రాజీనామా చేసినా, చేయకపోయినా.. ఆమె పదవీ కాలం ముగిసే మే 7వ తేదీ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతను కోల్పోతారని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ కూడా ఈ నిబంధనలను చదువుకోవాలని ఈ సందర్భంగా రామచందర్ రావు ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ నిబంధనలు, సీఎం పదవీ కాలం
మే 7 తర్వాత మమత పరిస్థితి
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె పదవీ కాలం మే 7తో ముగుస్తుందని రామచందర్ రావు తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.


