
తాజాగా విడుదలైన ‘భైరవం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంచు మనోజ్ తన సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Key Points
మంచు మనోజ్ 'భైరవం' సినిమా సక్సెస్ను జరుపుకుంటున్నారు.
ఆయన తన సక్సెస్ను మోహన్ బాబుకు ఆపాదించారు.
'భైరవం' సినిమాలో మంచు మనోజ్ పాత్ర గురించి వివరించారు.
మూడు హీరోలను హ్యాండిల్ చేయడం దర్శకుడి పనితనం అని మెచ్చుకున్నారు.
‘భైరవం’ సినిమా విజయం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధా మోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్స్గా చేశారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భైరవం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో మంచు మనోజ్తోపాటు ఇతర హీరోలు, డైరెక్టర్ విజయ్ కనకమేడలను అడిగిన ప్రశ్నలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అయితే, మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ ఇచ్చిన ఓ సమాధానం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
-అది డీఎన్ఏ. ఆయన ( మోహన్ బాబు ) దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చాను. నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మంచు మనోజ్ కామెంట్స్
-మా సినిమా స్టార్టింగ్ నుంచి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి, సోషల్ మీడియాకి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను.
-నేను చేసిన గజపతి క్యారెక్టర్కి చాలా డెప్త్ ఉంది. ఈ సినిమా కోసం డబ్బింగ్కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు. డైరెక్టర్ గారు చాలా పవర్ఫుల్గా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకి పేరు వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు. మా కో స్టార్స్ . ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి దక్కుతుంది.
మోహన్ బాబు పాత్ర
– ముగ్గురు హీరోల ను హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కథలో మూడు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. అందరి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేశాం.
-సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు హీరోలకి ఇది అద్భుతమైన కమ్ బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
మంచు మనోజ్ ‘భైరవం’ సినిమా విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. తన నటనకు ప్రేక్షకుల ఆదరణను కృతజ్ఞతగా స్వీకరించారు. భవిష్యత్తులో మరింత మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.


