|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మరకతమణి 2’తో సంచలనం! కార్తీ చేతుల మీదుగా ప్రారంభం.. నిక్కీ రీ ఎంట్రీతో హీట్!

Published: 17-02-2026, 9:35 AM
‘మరకతమణి 2’తో సంచలనం! కార్తీ చేతుల మీదుగా ప్రారంభం.. నిక్కీ రీ ఎంట్రీతో హీట్!
  • ‘మరకతమణి 2’ సినిమా పూజా కార్యక్రమాలతో ఫిబ్రవరి 16న ప్రారంభం
  • కార్తీ క్లాప్‌ కొట్టగా ఆర్య, వెంకట్ ప్రభు షూటింగ్ ప్రారంభించారు.
  • ఆది పినిశెట్టి వైఫ్ నిక్కీ గల్రానీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.
  • ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘మరకతమణి’ సీక్వెల్ ‘మరకతమణి 2’ ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి కార్తీ క్లాప్ కొట్టగా, నిక్కీ గల్రానీ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

‘మరకతమణి 2’ ఘనంగా ప్రారంభం

Maragadha Mani 2: ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) హీరోగా వచ్చిన ‘మరకతమణి’ (Maragadha Mani) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2017లో వచ్చిన ఈ సినిమా మ్యాజికల్ కాన్సెప్ట్‌తో, ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. అవును ‘మరకతమణి 2’ (Maragadha Mani 2) సినిమాను శివరాత్రి శుభ సందర్భంగా ఫిబ్రవరి 16న చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో.. హీరో కార్తీ క్లాప్‌ కొట్టగా.. హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు ‘కెమెరా.. రోలింగ్, యాక్షన్’ అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నిక్కీ గల్రానీ రీ ఎంట్రీ విశేషాలు

ఇక ఈ సీక్వెల్‌కు ఉన్న మరో విశేషమేమిటంటే.. పెళ్లి తర్వాత ఆది పినిశెట్టి వైఫ్ నిక్కీ గల్రానీ ఈ సినిమాలో చేస్తుండటం. ఆదితో పెళ్లి అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాంటి నిక్కీ గల్రానీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతోంది. నిక్కీ గల్రానీతో పాటు ఇందులో ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్‌గా ఇందులో నటిస్తోంది. ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్ అండ్ కెవి దురై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సాంకేతిక విభాగంలో ధిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తుండగా, పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ, ఎన్‌కే రాహుల్ ఆర్ట్ డైరెక్షన్, తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్, రాజేష్ కన్నన్ డైలాగ్స్, పీసీ స్టంట్స్ యాక్షన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

హీరో హీరోయిన్లు మరియు ఇతర నటీనటులు

ఆది పినిశెట్టి, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతోనే భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇందులో మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించే కంటెంట్ ఉందని, కచ్చితంగా ఈ సినిమా మొదటి పార్ట్‌ని మించి ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విరామం లేకుండా కొనసాగుతుందని, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను తెలియజేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి ‘మరకతమణి 2’ చిత్రం ప్రారంభోత్సవ వేడుకతో మంచి హైప్ క్రియేట్ చేసింది. నిక్కీ గల్రానీ రీ ఎంట్రీ మరియు ఇతర నటీనటుల కలయిక ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.