
📌 Key Points
- ప్రొఫెసర్తో సంబంధం ఉందనే పుకార్లతో మనోవేదనకు గురైన మెడికల్ విద్యార్థిని నిఖిత ఆత్మహత్య.
- కర్ణాటకలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బిఏఎంఎస్ చివరి సంవత్సరం చదువుతున్న నిఖిత.
- సహ విద్యార్థుల వేధింపులు, తప్పుడు ప్రచారంతో మనస్థాపం చెందిన నిఖిత.
- ఆత్మహత్య లేఖలో సహవిద్యార్థుల పేర్లు పేర్కొన్న నిఖిత, వారిపై చర్యలు తీసుకోవాలని తండ్రి ఫిర్యాదు.
కర్ణాటకలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రొఫెసర్తో అక్రమ సంబంధం ఉందనే పుకార్ల కారణంగా మనోవేదనకు గురైన వైద్య విద్యార్థిని నిఖిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణం?
ప్రొఫెసర్తో అక్రమ సంబంధం ఉందని తోటి విద్యార్థులు పుకార్లు వ్యాప్తి చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో ఉన్న రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చివరి సంవత్సరం చదువుతున్న నిఖిత (22) నిన్న తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని తండ్రి, కాలేజీ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ జీఎన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. నిఖిత తన కళాశాలలోని డాక్టర్ రాజు అనే లెక్చరర్తో తన చదువు విషయంలో ఆయనతో చొరవగా మాట్లాడేది. అయితే నిఖిత క్లాస్ మేట్స్ కొందరు నిఖితకు, సదరు లెక్చరర్కు మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టించి వాటిని వ్యాప్తి చేశారు.
తప్పుడు ప్రచారం చేయడంతోనే ఆగకుండా పదే పదే తన కూతురని ఆమె క్లాస్మేట్స్ అవమానపరిచేలా మాట్లాడారని నిఖిత తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారించాలని తాము తమ కూతురుకు ధైర్యం చెప్పామని అయినా తోటి విద్యార్థులు వేధింపులు ఆపకపోవడంతో మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తన కూతురు గదిలో ఆత్మహత్య లేఖ లభించిందని ఇందులో తన కుమార్తె మరణానికి కారణమని ఆరోపిస్తున్న సహవిద్యార్థుల పేర్లను పేర్కొందని తెలిపరు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సహ విద్యార్థుల వేధింపులు, తప్పుడు ప్రచారం
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తండ్రి
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిఖిత మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


