
📌 Key Points
- పెళ్లైన తర్వాత మాజీ ప్రియుడిని ఒక్కసారి కలిస్తే అడల్ట్రీ కాదని హైకోర్టు తీర్పు.
- కేవలం అనుమానంతో వ్యభిచారం నిర్ధారించలేమని న్యాయస్థానం స్పష్టం.
- భార్య మానసిక క్రూరత్వం కారణంగా విడాకులను సమర్థించిన హైకోర్టు.
- అత్తమామలపై నిరాధార ఆరోపణలు, కట్నం వేధింపుల కేసులే విడాకులకు కారణం.
పంజాబ్ & హరియాణా హైకోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పును వెలువరించింది. పెళ్లైన తర్వాత మాజీ ప్రియుడిని ఒక్కసారి కలిస్తే అది వ్యభిచారం కిందకు రాదని స్పష్టం చేసింది. అయితే, భార్య మానసిక క్రూరత్వం కారణంగా విడాకులను సమర్థించడం ఈ కేసులో కీలక అంశం.
మాజీ ప్రియుడితో భేటీ: అడల్ట్రీ కాదా?
మాజీ ప్రియుడితో ప్రియురాలు పెళ్లయిన తర్వాత కూడా ఒక్కసారి కలిస్తే.. అధి అడల్ట్రీ కాదని పంజాబ్ & హరియాణా హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి, అతని భార్యకు మధ్య జరిగిన వివాదంలో గుర్దాస్పూర్ ఫ్యామిలీ కోర్టు 2026 ఫిబ్రవరిలో విడాకులు మంజూరు చేసింది. దీనిపై భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన పంజాబ్ & హరియాణా హైకోర్టు.. వివాహానికి ముందు ఒక వ్యక్తితో రిలేషన్లో ఉండటం, పెళ్లయిన తర్వాత మాజీ ప్రియుడిని కేవలం ఒక్కసారి మాత్రమే కలవడాన్ని చట్టబద్ధంగా ‘వివాహేతర సంబంధం’ (Adultery) గా పరిగణించలేమని స్పష్టం చేసింది.
కేవలం అనుమానంతో, ఒకే ఒక్క ముఖాముఖి భేటీ ఆధారంగా భార్య వ్యభిచారం చేస్తుందని, మరొకరితో కలిసి జీవిస్తుందని నిర్ధారించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే, అక్రమ సంబంధం ఆరోపణలను తోసిపుచ్చి నప్పటికీ, హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును మాత్రం సమర్థించింది. సదరు మహిళ తన భర్త, అత్తగారి కుటుంబంపై ఎలాంటి ఆధారాలు లేకుండా కట్నం వేధింపుల కేసులు పెట్టిందని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా, వృద్ధుడైన తన మామగారి కన్ను తనపై పడిందని ఆమె చేసిన ఆరోపణల్లో తీవ్ర విరుద్ధమైన ప్రకటనలు ఉన్నాయని, ఆమె ప్రవర్తన అత్తగారి కుటుంబం పట్ల తీవ్రమైన ‘మానసిక క్రూరత్వానికి’ (Mental Cruelty) కిందికి వస్తుందని కోర్టు తేల్చింది. కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన నిందలు వేయడం విడాకులకు సరైన కారణమేనని పేర్కొంటూ పంజాబ్ & హరియాణా హైకోర్టు ఆ దంపతుల విడాకులను ఖరారు చేసింది.
విడాకులకు అసలు కారణం ఇదే!
అత్తమామలపై మానసిక క్రూరత్వం
ఈ తీర్పు వివాహ సంబంధాలలో నమ్మకం, మానసిక క్రూరత్వం వంటి అంశాలపై కొత్త చర్చకు దారితీసింది. కేవలం అనుమానాలతో కాకుండా, నిర్దిష్ట ఆధారాలతోనే న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయని మరోసారి స్పష్టం చేసింది.


