
📌 Key Points
- మెటా 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది, ఇది మొత్తం సిబ్బందిలో 10%.
- వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత తెల్లవారుజామున లేఆఫ్ మెయిల్స్ అందాయి.
- 7,000 మంది ఉద్యోగులను AI-నేటివ్ బృందాలకు బదిలీ, 6,000 ఖాళీ పోస్టుల రద్దు.
- మార్క్ జుకర్బర్గ్ AI సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా మరోసారి భారీ లేఆఫ్లతో వార్తల్లో నిలిచింది. వేల మంది ఉద్యోగులను తొలగించడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ నిర్ణయం టెక్ రంగంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాల విధానాలపై చర్చకు దారితీస్తోంది.
మెటాలో మరోసారి భారీ లేఆఫ్లు: కారణాలు ఏమిటి?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ లేఆఫ్స్ తో ఎంప్లాయిస్ కు షాకిచ్చింది. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి.. ఆ తర్వాత టైమ్ జోన్ల ప్రకారం నిద్రలేచే సమయానికల్లా లేఆఫ్స్ మెయిల్స్ పంపడం చర్చనీయాంశమైంది. అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో మెటా ఈ విధానాన్ని ఎంచుకుంది. మొదట ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి.. ఆ తర్వాత లే ఆఫ్స్ ఇవ్వడంతో ఉద్యోగులు షాకయ్యారు. సింగపూర్ హబ్ లోని ఉద్యోగులకు స్థానిక సమయం తెల్లవారుజామున 4 గంటలకు.. (భారత్ లో రాత్రి 1.30 గంటలకు) ఉద్యోగాలు ఊడినట్లు ఉద్యోగులకు మెయిల్స్ అందాయి. తన మొత్తం సిబ్బందిలో 10 శాతం మంది.. అంటే 8 వేల మంది ఉద్యోగులపై మెటా వేటు వేసింది.
ఈ లే ఆఫ్స్ కు ముందు మెటాలో మొత్తం 78,000 మంది ఉద్యోగులు ఉండేవారు. తాజాగా 8 వేల మంది ఉద్యోగుల్ని తొలగించడమే కాకుండా సంస్థాగతంగా మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం. మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత మెమో ప్రకారం.. సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ-నేటివ్ (AI-native) బృందాల్లోకి బదిలీ చేయనున్నారు. అలాగే దాదాపు 6,000 ఖాళీ పోస్టులను రద్దు చేస్తూ, మేనేజర్ల స్థాయిలను తగ్గించారు. కంపెనీని మరింత వేగంగా, తక్కువ మందితో సమర్థవంతంగా నడిపించడమే దీని లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కోతల్లో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలు ఎక్కువగా నష్టపోనున్నాయి. ప్రస్తుతం మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఏఐ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ ఏడాది ఏఐ కోసం ఏకంగా 125 నుండి 145 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని మెటా ప్రణాళికలు సిద్ధం చేసింది.
తెల్లవారుజామున షాకిచ్చిన తొలగింపు మెయిల్స్
AI వైపు మెటా దృష్టి: ఉద్యోగులపై ప్రభావం
మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. AI వైపు కంపెనీల మళ్లింపు, ఉద్యోగ కోతలు భవిష్యత్ కార్మిక మార్కెట్కు ఒక సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ పరిణామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


