
📌 Key Points
- పొగ మానేసిన కొద్ది క్షణాల నుంచే శరీరం తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తుంది.
- గుండెపై ఒత్తిడి తగ్గి, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
- నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు తాత్కాలికమే, శ్వాసకోశ వ్యవస్థ వేగంగా పునరుద్ధరణ అవుతుంది.
- ఊపిరితిత్తులలోని సిలియా మళ్లీ చురుగ్గా మారి విష పదార్థాలను బయటకు నెట్టివేస్తాయి.
ధూమపానం మానేయడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. పొగతాగడం ఆపేసిన వెంటనే శరీరం తనను తాను నయం చేసుకునే అద్భుతమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది. డాక్టర్ అరవింద్ బాడిగర్ విశ్లేషణ ప్రకారం, నిమిషాల నుంచి సంవత్సరాల వ్యవధిలో శరీరంలో సానుకూల మార్పులు వస్తాయి, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి.
పొగ మానేసిన వెంటనే శరీరంలో మార్పులు
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ చాలా మంది దానికి బానిసలవుతుంటారు. అయితే, ధూమపానం మానేయాలని నిర్ణయించుకోవడం ఒక వ్యక్తి జీవితంలో చేసే అతి ముఖ్యమైన మరియు సానుకూలమైన ఎంపికలలో ఒకటి. పొగతాగడం ఆపేసిన కొద్ది క్షణాల నుంచే మానవ శరీరం తనను తాను నయం చేసుకునే అద్భుతమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ రికవరీ ప్రక్రియ క్రమంగా సాగినప్పటికీ, నిమిషాలు, గంటలు మరియు సంవత్సరాల వ్యవధిలో శరీరంలో వచ్చే సానుకూల మార్పులు భవిష్యత్తులో వచ్చే ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాలను దూరం చేస్తాయి.
బిడిఆర్ ఫార్మాస్యూటికల్స్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బాడిగర్… హెచ్టి లైఫ్స్టైల్కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. ధూమపానం నిలిపివేసిన తర్వాత మానవ శరీరం మానసికంగా, శారీరకంగా ఎలా స్పందిస్తుందో మరియు నష్టాన్ని ఎలా తిప్పికొడుతుందో వివరంగా డీకోడ్ చేశారు.
డాక్టర్ అరవింద్ ప్రకారం…. పొగతాగడం తక్షణమే ఆపడం వల్ల శరీరంలో చాలా వేగంగా కింది శారీరక మార్పులు వస్తాయి:
నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు
దీర్ఘకాలంగా ధూమపానం చేసేవారి గుండెపై ఈ మార్పుల వల్ల ఒత్తిడి ఊహించని విధంగా తగ్గుతుందని… ఇది శరీరం యొక్క అద్భుతమైన కోలుకునే సామర్థ్యాన్ని చూపుతుందని డాక్టర్ అరవింద్ వివరించారు.
ధూమపానానికి నెలలు, సంవత్సరాల పాటు దూరంగా ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం కింది విధంగా తగ్గుతుంది:
ధూమపానం మానేసిన ప్రారంభ రోజుల్లో, మెదడుకు నికోటిన్ అందకపోవడం వల్ల శరీరం కొంత అసౌకర్యానికి గురవుతుంది. దీనినే ‘నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు’ (Nicotine Withdrawal Symptoms) అంటారు. దీనివల్ల వ్యక్తుల్లో మళ్లీ పొగతాగాలనే బలమైన కోరిక, మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, ఆందోళన, ఏకాగ్రత లేకపోవడం, నిద్రలేమి మరియు తినే అలవాట్లలో మార్పులు వంటి తాత్కాలిక సమస్యలు ఎదురవుతాయి.
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు
మరోవైపు ఇదే సమయంలో శ్వాసకోశ వ్యవస్థ యొక్క పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది. ఊపిరితిత్తులలోని చిన్న చిన్న జుట్టు లాంటి నిర్మాణాలు (సిలియా – Cilia) మళ్లీ చురుగ్గా మారి, లోపల పేరుకుపోయిన శ్లేష్మం (కఫం) మరియు విషపూరిత పదార్థాలను బయటకు నెట్టివేస్తూ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి.
ధూమపానం మానేయడం వల్ల దాదాపు ప్రతి శారీరక వ్యవస్థ సానుకూల మార్గంలో మెరుగుపడుతుందని డాక్టర్ అరవింద్ స్పష్టం చేశారు. ప్రారంభంలో నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు కఠినంగా అనిపించినప్పటికీయయయయ అవి తాత్కాలికమైనవి మాత్రమే. వీటిని సరైన కౌన్సెలింగ్, అవసరమైతే ‘నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ’ (NRT) ద్వారా సులభంగా అధిగమించవచ్చు. స్వల్పకాలంలో కలిగే చిన్నపాటి అసౌకర్యం కంటే, భవిష్యత్తులో క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ముప్పుల నుండి లభించే దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణ ఎంతో విలువైంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ధూమపానం మానేయడం వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, అవి తాత్కాలికమే. ఈ నిర్ణయం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది, దీర్ఘకాలికంగా మెరుగైన జీవితాన్ని అందిస్తుంది.


