
📌 Key Points
- వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయని మోడీ ఆరోపించారు.
- కేరళలో హిందూ, క్రైస్తవ కుటుంబాలను బెదిరించారని మోడీ అన్నారు.
- ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే అభివృద్ధి చేసిందని మోడీ పేర్కొన్నారు.
- కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందని మోడీ హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు తీవ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. కేరళలోని క్రైస్తవ కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలపై మోడీ తీవ్ర విమర్శలు
ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వాపక్షాలు, కాంగ్రెస్ తీవ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. కేరళలో మునబం వంటి సంఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని అక్కడ వందలాది హిందూ, క్రైస్తవ కుటుంబాలను బెదిరించారని ఆరోపించారు. బాధితులకు సహాయం చేయడానికి బదులుగా కేరళ ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇవన్నీ గమనించిన కేరళంలోని దేశభక్తి కలిగిన ప్రజలు దీనిని ఎప్పటికీ జరగనివ్వరన్నారు. ఇవాళ కేరళంలోని తురువల్లలో ఎన్నికల ప్రచారంలోమాట్లాడిన మోడీ మునంబంలోని 404 ఎకరాల భూమి తమదేనంటూ వఖ్ఫ్ బోర్డు చేస్తున్న వాదనల వల్ల దాదాపు 600 కుటుంబాలు (మెజారిటీ క్రైస్తవులు) నిరాశ్రయులయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
క్రైస్తవులు అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోని 7 రాష్ట్రాల్లో ఎన్డీయే (NDA) అధికారంలో ఉందని గత 50-60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము అక్కడ చేసి చూపించామని మోడీ పేర్కొన్నారు. గోవాలో క్రైస్తవ సమాజం నిర్ణయాత్మక శక్తిగా ఉందని అక్కడ కూడా ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేరళలో కూడా ఎన్డీయే ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతుందని హామీ ఇచ్చారు. కేరళలో రోడ్లు, వంతెనలు, మెడికల్ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందని, గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై మోడీ ప్రశంసలు
కేరళ అభివృద్ధికి ఎన్డీయే హామీ
కేరళలో అభివృద్ధి జరగాలంటే ఎన్డీయే ప్రభుత్వం రావాలని మోడీ అన్నారు. రాష్ట్ర ప్రజలు దీనిని గమనించి ఓటు వేయాలని ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో చూడాలి.


