|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం

Published: 30-05-2025, 1:59 AM
నందిని గుప్తా మిస్ వరల్డ్ టైటిల్ గెలిస్తే మనమే నెంబర్ 1.. ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్న బుల్లి దేశం

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఇండియా తరఫున నందిని గుప్తా పోటీపడుతోంది. ఆమె టాప్ 40లో చోటు సంపాదించింది. ఇండియాకు మిస్ వరల్డ్ టైటిల్స్ లో గట్టి పోటీ వెనుజులా నుండి ఉంది.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.

2

నందిని గుప్తా టాప్ 40 లో చోటు సంపాదించింది.

4

వెనుజులా కూడా ఇండియాకు సమానంగా ఆరు టైటిల్స్ గెలుచుకుంది.

మిస్ వరల్డ్ 2025 పోటీలు

హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది దశకి చేరుకున్నాయి. మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలే తో మిస్ వరల్డ్ పోటీలు ముగుస్తాయి. 2024 లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా ఈ ఏడాది విజేతగా నిలిచే సుందరీమణికి కిరీటం అందజేస్తారు. క్రిస్టినా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మహిళ.

అయితే ఈసారి మిస్ వరల్డ్ కిరీటం ఏ దేశానికి చెందిన మోడల్ కి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది. మొత్తం 108 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే నందిని గుప్తా టాప్ 40 లో అర్హత సాధించారు.

నందిని గుప్తా యొక్క ప్రదర్శన

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే. అంటే మిస్ వరల్డ్ టైటిల్స్ లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. 1966లో తొలిసారి ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ముంబై కి చెందిన రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది

ఆ తర్వాత 1994 లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని సంచలనం సృష్టించింది. 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో మనం మాత్రమే నెంబర్ వన్ కాదు. చిన్న ట్విస్ట్ ఉంది. 2.8 కోట్ల జనాభా కలిగిన బుల్లి దేశం వెనుజులా కూడా ఇండియాకి సమానంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఆరు టైటిల్స్ సాధించింది. ఆ దేశం తరపున 1995, 1981, 1984, 1991, 1995, 2011 సంవత్సరాలలో సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు.

ఇండియా మరియు వెనుజులా పోటీ

ఇండియా, వెనుజులా తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఐదు టైటిల్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఈసారి ఇండియా తరపున నందిని గుప్తా టైటిల్ సాధిస్తే మనమే నెంబర్ 1 అవుతాం. మిస్ వరల్డ్ 2025 కిరీటం ఎవరిది అనేది శనివారం రోజు జరిగే ఫైనల్స్ లో తేలిపోనుంది.

మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ శనివారం జరుగుతున్నాయి. నందిని గుప్తా విజయం ఇండియాకు మరో టైటిల్‌ను అందిస్తుంది. వెనుజులాతో సమపోటీలో ఉన్న ఇండియా, నందిని విజయంతో మళ్ళీ అగ్రస్థానం దక్కించుకుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.