|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుస ఫ్లాపులతో షాకింగ్ డెసిషన్! నితిన్ మాస్ రీఎంట్రీ! ఈసారి డబుల్ ధమాకా!

Published: 07-05-2026, 12:00 AM
వరుస ఫ్లాపులతో షాకింగ్ డెసిషన్! నితిన్ మాస్ రీఎంట్రీ! ఈసారి డబుల్ ధమాకా!
  • నితిన్ కెరీర్ లోనే తొలిసారి ఇద్దరు యువ దర్శకులతో భారీ ప్రాజెక్ట్ షురూ.
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ప్రారంభం.
  • ‘మిరాయ్’ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా సందడి చేయనుంది.
  • మే రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో నితిన్, కెరీర్ లోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు! ఊహించని ట్విస్ట్‌లతో కూడిన ఈ కొత్త ప్రాజెక్ట్ తెలుగు సినీ లోకంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి నితిన్ ఏకంగా ఇద్దరు కొత్త దర్శకులతో కలిసి రాబోతున్నాడు. ఈ మార్పు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

నితిన్ షాకింగ్ డెసిషన్: ఇద్దరు కొత్త డైరెక్టర్లతో సినిమా!

నితిన్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా ఎదిగాడు. వరుస హిట్లతో మంచి స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. వరుసగా లవ్‌ స్టోరీస్‌ చేసి యూత్‌కి, అమ్మాయిలకు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు రాలేదు. క్రమంగా ఆయన కెరీర్‌ తలక్రిందులవుతుంది. ఒక్క హిట్‌ వస్తే, నాలుగైదు పరాజయాలు వరిస్తున్నాయి. అయినా హీరోగా నిలబడ్డాడు. రాణిస్తున్నాడు. అయితే ఇన్నాళ్ల అనుభవాలతో ఇప్పుడు నితిన్‌ రూట్‌ మార్చాడు. సరికొత్త పంథాతో ముందుకు సాగుతున్నాడు. తాజాగా బుధవారం తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. సితార బ్యానర్‌లో ఈ చిత్రం చేస్తున్నారు.

మాస్ డైరెక్టర్లకు ఛాన్స్.. హీరోయిన్ గా మిరాయ్ బ్యూటీ!

ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్  సమర్పిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్‌ ఏంటంటే దీనికి నారి సిరిసవాడ, సోమశేఖర్‌ టి అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తుండగా, వీరిద్దరు కొత్త వారు కావడం విశేషం. అనుభవమున్న వారితో చేదు అనుభవాలు చవిచూసిన నితిన్‌ ఇప్పుడు రూట్‌ మార్చి కొత్తవాళ్లతో చేస్తున్నారు. పైగా దర్శకత్వ ద్వయంతో ఆయన మూవీ చేస్తుండటం విశేషం. దీనికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, `మిరాయ్‌` ఫేమ్‌ రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమా ప్రారంభం.. షూటింగ్ ఎప్పుడంటే?

నితిన్‌ కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సినిమాటోగ్రాఫర్‌గా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుందని,  షూటింగ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతున్నామని, మిగిలిన వివరాలు మున్ముందు వెల్లడించనున్నట్టు టీమ్‌ తెలిపింది.

నితిన్ కెరీర్ లో ఈ సాహసోపేత నిర్ణయం ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. ఇద్దరు కొత్త దర్శకులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూద్దాం. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.