
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తాజా ఇంటర్వ్యూలో తన భావోద్వేగాలను పంచుకున్నారు. గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అతని అరెస్టు, కుటుంబంపై పడిన కష్టాలు ఆయనను ఎంతగానో కలచివేశాయి.
Key Points
బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఫినాలే తర్వాత అరెస్ట్.
అభిమానుల హంగామా కారణంగా పోలీసుల అరెస్టు.
ఇంటర్వ్యూలో తన తండ్రిని కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని బోరున ఏడ్చారు.
విజయం ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది.
బిగ్ బాస్ విజయం తర్వాత అరెస్టు
బిగ్ బాస్ ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ . జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాలన్న కల నేరవేర్చుకోవడమే కాదు .. ఏకంగా విన్నర్ గా నిలిచాడు . రైతుబిడ్డగా హోస్ లోకి ఎంట్రీ ఇచ్చి .. బిగ్ బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు . జై జవాన్- జై కిసాన్ అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు .
అభిమానుల హంగామా
అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం ప్రశాంత్ కు కొద్దిగంటల్లోనే ఆవిరైంది . గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు హంగామా సృష్టించారు . దీంతో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు .
భావోద్వేగ ఇంటర్వ్యూ
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పల్లవి ప్రశాంత్ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు . పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు . ఇంత బతుకు బతికి .. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని ఏడ్చేశారు . ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు .
బిగ్ బాస్ విజయం ఆనందం క్షణికమైంది. అరెస్టు, కుటుంబంపై పడిన కష్టాలను గుర్తుచేసుకుని పల్లవి ప్రశాంత్ బోరున ఏడ్చారు. ఈ సంఘటన అభిమానులను కలిచివేసింది.


