
ఆంధ్రప్రదేశ్లోని థియేటర్ల బంద్పై తీవ్ర వివాదం నెలకొంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. దిల్రాజు, జనసేన ఎగ్జిబిటర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Key Points
థియేటర్ల బంద్ వివాదంలో పవన్ కళ్యాణ్ జోక్యం
దిల్ రాజు ఆరోపణలు, జనసేన ఎగ్జిబిటర్ సత్యనారాయణ స్పందన
జనసేన నాయకుడు సత్యనారాయణను పార్టీ సస్పెండ్ చేయడం
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్పై ఉద్రిక్తత
థియేటర్ల బంద్ వివాదం
థియేటర్ల బంద్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గానే ఉన్నారు. థియేటర్ల మెయింటనెన్స్ విషయంలో రాజీపడేది లేదని, ఆడియెన్స్ కి థియేటర్లలో ఫుడ్ కాస్ట్ అందుబాటులో ఉండాలని, టాయిలెట్లు నీట్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. సదరు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి కూడా సూచనలు చేశారు.
అదే సమయంలో థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. ఈ విషయంపై విచారణకు కూడా ఆదేశించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ బంద్ వ్యవహారం ప్రారంభమైందని, జనసేనాకి చెందిన సత్యనారాయణ అనే ఎగ్జిబిటర్లు ఈ నినాదం తీసుకొచ్చారని దిల్ రాజు ఆరోపించారు.
దిల్రాజు ఆరోపణలు మరియు జనసేన నాయకుని స్పందన
సత్యనారాయణ జనసేన లీడర్. తూర్పు గోదావరి జిల్లాలో మంచి స్థాయిలో ఉన్నారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తాను తప్పు చేయలేదని నిరూపించుకునేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎగ్జిబిటర్ సత్యనారాయణ స్పందించారు. దిల్ రాజు కావాలనే తనపై నిందలు వేశారని తెలిపారు. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలన్నారు.
పవన్ కళ్యాణ్ నా దేవుడు అని, ఆయన సినిమాని నేనెందుకు ఆపుతాను, ఏప్రిల్ 24న థియేటర్ల బంద్ నిర్ణయాన్ని మేం తీసుకుంటే, మే 16న `హరిహర వీరమల్లు` సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారని తెలిపారు. పవన్ సినిమాకి వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మరియు హరిహర వీరమల్లు సినిమా
తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్కి విధేయుడినే అని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇలా థియేటర్ల మూసివేత కుట్రకి సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. మరి ఇది మున్ముందు ఎటు వైపు వెళ్తుందో చూడాలి. కానీ పవన్ ఈ విషయంపై సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే వార్తలు ఆ చిత్ర బృందాన్ని కలవరానికి గురి చేశాయి. మే ఎండింగ్లో విడుదలయ్యే సినిమాలు, జూన్ లో విడుదలయ్యే సినిమాల మేకర్స్ కూడా ఆందోళన చెందారు.
ఈ క్రమంలో పవన్ రియాక్షన్తో ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
థియేటర్ల బంద్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. ఈ వివాదం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్పై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.


