
📌 Key Points
- ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
- సమావేశానికి ఐదు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు.
- ఇరాన్ దిగ్బంధం వల్ల కలిగే ప్రభావంపై చర్చించారు.
- రాష్ట్రాల సహకారంతో సమస్యలను ఎదుర్కోవాలని మోడీ అన్నారు.
దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐదుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై మోడీ సమీక్షించారు.
ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల సమావేశం
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ వర్చువల్గా ప్రధాని మోడీ సమావేశం కావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా వార్ నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులు, దేశంపై ప్రభావాన్ని ముఖ్యమంత్రులకు వివరించనున్నారు. అయితే అనూహ్యంగా ఈ కీలక సమావేశానికి ఐదుగురు ముఖ్యమంత్రులు గైర్హాజరు కాబోతున్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు హాజరు కాలేమని ముందుగా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఇవాళ్టి భేటీలో ప్రధాని మోడీ.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ చర్యలు అమలు జరిగేలా చూడటంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని కోరబోతున్నారు. అలాగే ఇంధన, నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులకు వివరించబోతున్నారు. టీమ్ ఇండియాలాగా కలిసిగట్టుగా ఉంటే ఏ సమస్యను అయినా ఎదుర్కోగలం అని సంకేతాన్ని ముఖ్యమంత్రులకు మోడీ వివరించనున్నారు.
గైర్హాజరైన ఐదుగురు ముఖ్యమంత్రులు
చమురు సరఫరాపై ప్రధాని ఆందోళన
దేశంలోని పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్షించారు. రాష్ట్రాల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


