
📌 Key Points
- చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలు పద్మకు రోడ్డుపై 45 తులాల బంగారం దొరికింది.
- పద్మ ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకుంది.
- రజనీకాంత్ పద్మను సన్మానించి, ప్రతి నెల రూ.10,000 సాయం చేస్తానని అన్నారు.
- ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పద్మను సన్మానించి రూ.1 లక్ష నగదు బహుమతి అందజేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. చెన్నైలో బంగారు ఆభరణాలు దొరికిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ఆయన సన్మానించారు. ఆమెకు ఆర్ధిక సహాయం కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు.
పద్మ నిజాయితీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు
Rajinikanth Humanity: సూపర్ స్టార్ రజనీ కాంత్ మరో సారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు, విధి నిర్వహణలో రోడ్డుపై 45 తులాల బంగారు ఆభరణాలు ఉన్న ఒక సంచి దొరికింది. ఆమె దానిని వెంటనే పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆమె ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇదే విషయంపై సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా స్పందించారు. ఆ కార్మికురలిని ఇంటికి పిలిపించి బంగారు గొలుసులో సన్మానించారు. అంతే కాకుండా.. నేల నెలా పది వేల రూపాయలు సాయం అందిస్తానని భరోసా కూడా ఇచ్చారు. దీంతో మరో సారి రజనీ మానవత్వం నిండిన సూసర్ స్టార్ అనిపించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా పద్మను సన్మానించి, ఆమెకు రూ.1 లక్ష నగదును కూడా అందజేశారు.
Read also- Suriya: కర్ణుడిగా సూర్య.. ఆరేళ్ళ కష్టం.. అంచనాలు పెంచిన డైరెక్టర్!
రజనీకాంత్ సన్మానం, ఆర్థిక సహాయం
ఇటీవల్ చెనైలో జరిగిన ఈ ఘటన దేశంలో నిజాయితీ ఇంకా బతికే ఉందని నిరూపించింది. సాధారణంగా పది రూపాయలు దొరికితేనే దానిని ఎవరూ చూడకుండా జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో, లక్షల బంగారం దొరికితే తన బంగారు మనసుతో వాటిని పోలీసులకు అప్పగించింది. కోట్ల విలువ బంగారంలోనే కాదు.. నిజాయితీలో కూడా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పింది. మహా భారతం ఆదిపర్వంలో చెప్పినట్లుగా బంగారం ఎక్కడుంటే అక్కడ కలి సంచారం ఉంటుందని, వారి కుటుంబాల్లో మనశ్శాంతి కరువవుతుందని ఆమె బాగా నమ్మినట్లుంది. అందుకే వాటిని చేరాల్సిన చోటుకే చేర్చింది. పాపులారిటీ కోసం పాకులాడే ఈ లోకంలో నిజాయితీతో కూడా పాపులర్ అవ్వోచ్చని ప్రూవ్ చేశారు. సమాజంలో ఉండే రోడ్లను చీపురుతో శుభ్రం చేసినట్లు.. మనుషుల్లో ఉండే అత్యాశను కూడా నిజాయితీతో శుభ్రపరచవచ్చని సమాజానికి తెలిసేలా చేసింది. లక్షల రూపాయల నగలను పోలీసులకు అప్పగించి కోట్లది మంది మనసు గెలుచుకుంది. అవినీతిలో కూరుకుపోయి విలాసంతమైన చెత్తకుప్పల్లో నివసించే అనేక మంది రాజకీయ నాయకులకు ఈ ఘటన ఒక చెంపపెట్టులా మారింది.
Read also- Takshakudu: ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ అప్డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి నగదు పురస్కారం
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారట. రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలిచే ఒక నమ్మకమైన స్నేహితుడిగా (Confidante) షారుక్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మిథున్ చక్రవర్తి, రజనీ కాంబినేషన్ సెట్ అవ్వగా, ఇప్పుడు షారుక్ కూడా తోడవడంతో సినిమా రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది.
పద్మ నిజాయితీని రజనీకాంత్, స్టాలిన్ మెచ్చుకోవడం గొప్ప విషయం. ఇది సమాజంలో మంచి ఇంకా బతికే ఉందని నిరూపిస్తుంది. ఆమె నిజాయితీ అందరికీ ఆదర్శం.


