
ప్రముఖ నటి రష్మిక మందన్న తాజా ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. డబ్బులిచ్చి తనను ట్రోల్ చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Key Points
రష్మిక మందన్న తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి బాధ వ్యక్తం చేసింది.
కొందరు డబ్బులిచ్చి ఆమెను ట్రోల్ చేయిస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఆమె ఎమోషనల్గా మాట్లాడుతూ, ఈ ట్రోలింగ్ తనను ఎంతగానో బాధపెడుతోందని తెలిపింది.
రష్మిక ప్రేక్షకులను ప్రశాంతంగా ఉండమని కోరింది.
రష్మిక మందన్న ట్రోలింగ్ గురించి ఆవేదన
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. రీసెంట్గా ‘కుబేర’(Kubera) మూవీతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన ఈ భామ ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్ల గురించి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
డబ్బుతో ట్రోలింగ్ను ప్రేరేపిస్తున్నారా?
ఆమె మాట్లాడుతూ.. ‘నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిని. కానీ అవన్నీ నేను బయట పెట్టడానికి ఇష్టపడను. అలా చేస్తే నేను కెమెరా కోసం చేశాను అని అంటున్నారు. నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. నా ఎదుగుదలను కావాలనే అడ్డుకుంటున్నారు. బయట జనాలు క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ నన్ను బాధ పెడుతున్నాయి. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ ప్రశాంతంగా ఉండండి’ అంటూ రష్మిక ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
రష్మిక యొక్క ఎమోషనల్ అభ్యర్థన
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
రష్మిక మందన్న తనపై జరుగుతున్న ట్రోలింగ్పై తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో ప్రవర్తన మార్పు కోసం ఆమె ప్రేక్షకులను కోరింది. ఆమె ఎమోషనల్ స్థితిని అభిమానులు గుర్తించారు.


