
📌 Key Points
- రష్మిక, విజయ్ త్వరలో విడాకులు తీసుకుంటారని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.
- రాజస్థాన్లో ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
- మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
- వేణు స్వామి సెలబ్రిటీలకు పూజలు చేస్తూ ఉంటారు, ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి ఫిబ్రవరి 26న జరిగింది. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు త్వరలోనే విడాకులు తీసుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.
రష్మిక, విజయ్ వివాహం వివరాలు
Venuswamy : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిర్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. ఈ జంట గత కొద్ది రోజులుగా రిలేషన్ నుండి ఈ మధ్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా, మంచు కొండల సాక్షిగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి.. అయితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్పై పడింది.. ఈ కార్యక్రమానికి కేవలం సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మాత్రమే కాదు, రాజకీయ వేత్తలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ జంట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఆయన ఈ జంట విడిపోతారు అని అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకసారి ఆయన ఏమన్నాడో వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీలకు పూజలు చేస్తూ ఉంటాడు.. ఇప్పటికే ఎంతోమంది ఆయన చేత పూజలు చేయించుకున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు హీరోయిన్లు వేణు స్వామి చేత పర్సనల్గా పూజలు చేయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అందులో రష్మిక మందన్న కూడా ఒకరు. అయితే వేణు స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. అందులో రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి కదా.. వారు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటారా అని అడుగుతారు యాంకర్. ఆయన ఒక్క మాటతో షాక్ ఇచ్చాడు.. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ జాతకాల్లో కలిసి ఉంటారని లేదు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అని ఆయన అన్నాడు.. ఆ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన విజయ్ అభిమానులు వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు.
వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
విడాకుల గురించి వేణు స్వామి జోస్యం
టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లతో ప్రత్యేక పూజలు చేయించి ఒక్కసారిగా సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా మారిపోయారు వేణు స్వామి.. ఈయనతో పూజలు చేయించుకుంటే చాలావరకు మంచి జరుగుతుందని నమ్ముతున్న హీరోయిన్లు వరుసగా ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.. రష్మిక మందన్న కూడా ఆయనతో పూజలు చేయించుకుంది.. సినిమా రంగంలోని వాళ్లు మాత్రమే కాదు అటు రాజకీయవేత్తలు కూడా ఆయనతో పూజలు చేయించుకునేందుకు ఆయన ఇంటికి వస్తున్నారు. అయితే ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ ట్రోల్స్ కి గురవుతున్న విషయం తెలిసిందే.. సమంత నాగచైతన్య విడాకుల విషయం తర్వాత ఆయన సెలబ్రిటీల గురించి బయట పెడుతూ వస్తున్నారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట విడాకులు తీసుకుంటారు అని చెప్పిన వీడియో పై రష్మిక మందన్న అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..
వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దీనిపై రష్మిక, విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వారి అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.


