
📌 Key Points
- రంగారెడ్డి జిల్లాలోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పులు, డ్రగ్స్ సీజ్.
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుండగా దాడి చేసిన పోలీసులు.
- పార్టీలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్టు సమాచారం.
- డ్రగ్స్ పరీక్షల్లో రోహిత్ రెడ్డితో పాటు పలువురికి పాజిటివ్ అని నిర్ధారణ.
రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కాల్పులు జరగడం, డ్రగ్స్ లభ్యం కావడం సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు.
ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి వేళ కాల్పుల మోత మోగింది. ఈ ఫామ్ హౌస్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినది అని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ మోయినాబాద్ అజీజ్నగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం , డ్రగ్స్ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్ హైస్పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీమ్, ఎస్ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.
ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను పోలీసులు వెల్లడించారు.
కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ ప్రాంతం
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏలురు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, యం రమేశ్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు ఈ ఫామ్ హౌస్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్టు వివరించారు.
ఈ పార్టీపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి 2 గ్రాముల వైట్ పౌడర్ను అధికారులు సీజ్ చేశారు. పరీక్షల్లో అది డ్రగ్సే అని తేలింది.
కాగా పార్టీలో చిక్కిన వారికి పోలీసులు డ్రగ్స్ కిట్తో టెస్టింగ్ నిర్వహించారు. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమీద్ మిశ్రా, కాసిక్ రవితో పాటు అర్జున్ రెడ్డికి ఈ టెస్టింగ్లో పాజిటివ్గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తదుపరి నిర్థరణ కోసం శాంపిల్స్ని హాస్పిటల్కి పంపించినట్టు వివరించారు.
డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ తేలిన ప్రముఖులు
అయితే ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకోలేదని పట్టుబడ్డ కొందరు చెబుతున్నారు. గత వారం సిమ్లా, గోవాలో డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు చెప్పారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చేవేళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.
ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు కొందరు అంగీకరించకపోవడం, గతంలో సిమ్లా, గోవాలో తీసుకున్నట్లు చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


