|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారత్, పాక్ సీజ్‌ఫైర్‌.. సల్మాన్ ఖాన్ పోస్టుపై ఫ్యాన్స్ ఫైర్.. వెంటనే డిలీట్.. అప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నలు

Published: 11-05-2025, 10:52 AM
భారత్, పాక్ సీజ్‌ఫైర్‌.. సల్మాన్ ఖాన్ పోస్టుపై ఫ్యాన్స్ ఫైర్.. వెంటనే డిలీట్.. అప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నలు

భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సీజ్‌ఫైర్‌పై సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆపరేషన్ సింధూర్‌పై ఆయన మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో సల్మాన్ తన ట్వీట్‌ను తొలగించారు.

Key Points

1

సల్మాన్ ఖాన్ భారత్-పాక్ సీజ్‌ఫైర్‌పై ట్వీట్ చేశారు.

2

ఆ ట్వీట్‌కు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.

4

సల్మాన్ ఖాన్ తన ట్వీట్‌ను తొలగించారు.

సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్‌పై సల్మాన్ రియాక్టయ్యారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీంతో సల్మాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ పై ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. దీంతో సల్మాన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై స్పందించకపోవడంతో వ్యతిరేకత ఎదురైన తర్వాత దాన్ని తొలగించారు.

శనివారం (మే 10) భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్‌ అనౌన్స్ చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ ఎక్స్ లో ‘‘సీజ్‌ఫైర్‌ కు దేవునికి ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై సల్మాన్ రియాక్టవడం ఓ వర్గం నెటిజన్లు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో సల్మాన్ పై ఫైర్ అవుతున్నారు.

సీజ్‌ఫైర్‌ పై సల్మాన్ ట్వీట్ కు నెటిజన్లు కోపంతో రియాక్టయ్యారు. ఆపరేషన్ సిందూర్ పై సల్మాన్ మౌనంపై కొంతమంది ప్రశ్నించారు. “ఆపరేషన్ సింధూర్ గురించి ట్వీట్‌లు లేవు. ఎందుకు?” ఒక వ్యక్తి ప్రశ్నించారు. “పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మీరు ఎందుకు ఏమీ చెప్పలేదు” అని మరొకరు కూడా అన్నారు.

నెటిజన్ల నుండి విమర్శలు

మరోవైపు కొంతమంది సల్మాన్ ఖాన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో సల్మాన్ తప్పు ఏముందని అడుగుతున్నారు. సల్మాన్ ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాత ఓ ఫ్యాన్.. ‘‘”ఆ ట్వీట్ తర్వాత, పాకిస్తాన్ సీజ్‌ఫైర్‌ ను ఉల్లంఘించిందనే వార్త వచ్చింది. కాబట్టి ఆయన ఆ ట్వీట్‌ను తొలగించారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సల్మాన్ ఖాన్ తప్పు ఏమిటి?” అని రాసుకొచ్చారు. యుద్ధ విరామానికి అంగీకరించిన తర్వాత, పాకిస్తాన్ కొన్ని గంటల తర్వాత దాన్ని ఉల్లంఘించింది.

26 మంది మరణించిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, సల్మాన్ ఇలా ట్వీట్ చేశారు.. “భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది. నిరపరాధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నా హృదయం వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తోంది. ఒక నిరపరాధిని చంపడం మొత్తం విశ్వాన్ని చంపడంతో సమానం’’ అని సల్మాన్ పోస్టు చేశారు.

ట్వీట్ డిలీట్

శనివారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి.. భారత్, పాకిస్తాన్ రెండూ సాయంత్రం 5 గంటల నుంచి నేల, సముద్రం, గాలిలో అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని ప్రకటించారు. కరీనా కపూర్, కరణ్ జోహార్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ అప్‌డేట్‌పై స్పందించారు. కరీనా ఇన్‌స్టాగ్రామ్‌లో “రబ్ రఖా” (నమస్కారం చేతుల ఎమోజి), “జై హింద్” (భారత త్రివర్ణ పతాకం ఎమోజి) పోస్ట్ చేశారు. కరణ్ జోహార్ నమస్కారం, నారింజ రంగు హృదయ ఎమోజిలతో స్పందించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మే 7న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా సైనిక చర్య అయిన ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. రోజుల తరబడి పెరుగుతున్న ఉద్రిక్తతల తర్వాత, రెండు దేశాలు అన్ని కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించాయి.

సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్‌కు వచ్చిన విమర్శలతో ఆయన ట్వీట్‌ను తొలగించారు. ఆపరేషన్ సింధూర్‌పై ఆయన స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.