
ప్రముఖ నటి సౌందర్య తన సినీ జీవితంలో అనేక విభిన్న పాత్రలు పోషించింది. ఆమె ‘శ్రీరాములయ్య’ చిత్రంలో వృద్ధురాలిగా నటించిన సంఘటన ఆమెకు ఎంతో ప్రత్యేకమైనది. దీని గురించి తెలుసుకుందాం.
Key Points
సౌందర్య ‘శ్రీరాములయ్య’ చిత్రంలో వృద్ధురాలిగా నటించారు.
30,000 మంది ప్రేక్షకుల ముందు మొదటి సన్నివేశం చిత్రీకరించబడింది.
ఈ సినిమా సౌందర్యకు ఒక భిన్నమైన అనుభవాన్ని అందించింది.
‘శ్రీరాములయ్య’ చిత్రం సౌందర్యకు బాగా నచ్చిన చిత్రాల్లో ఒకటి.
శ్రీరాములయ్య చిత్రం: సౌందర్య యొక్క అద్భుతమైన నటన
తెలుగు సహజ నటి సౌందర్య మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు గడిచినా ఆమె ఇంకా మన మధ్య ఉన్నట్టుగానే ఉంటుంది. తన సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన నటన మెప్పిస్తూనే ఉంది.
గ్లామర్కి దూరంగా ఉంటూ సాంప్రదాయానికి పెద్ద పీఠ వేసిన సౌందర్య సినిమా జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలు కూడా ఉన్నాయి.
సౌందర్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె చాలా కమర్షియల్ చిత్రాలు చేసింది. కొన్ని అభ్యుదయ చిత్రాల్లో కూడా నటించింది. అలాంటి మూవీనే `శ్రీరాములయ్య`.
పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత కథని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. దీనికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించగా, ఇందులో మోహన్ బాబు హీరోగా నటించారు. హరికృష్ణ, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.
1998లో విడుదలైన `శ్రీరాములయ్య` మూవీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో కమ్యూనిస్ట్ ల ప్రభావం ఉండటంతో ఇలాంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
30,000 మంది ప్రేక్షకుల ముందు మర్చిపోలేని క్షణం
అలా ఈ మూవీ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఊర్లల్లో జనాలు ఎండ్లబండ్లు, ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చిన సందర్భాలున్నాయి. అంతగా పల్లె జనాలను ప్రభావితం చేసిన చిత్రమిది.
అయితే ఇందులో శ్రీరాములుగా నటించిన మోహన్ బాబుకి భార్య పాత్రలో నటించింది సౌందర్య. ఇందులో మొదటి షాట్లో సౌందర్య వృద్ధురాలిగా కనిపిస్తుంటుంది.
శ్రీరాములు పాత్ర చనిపోయిన తర్వాత ఆయన స్థూపం ఆవిష్కరించే సీన్ అది. ఆ సీన్లో జనాలను ఉద్దేశించి సౌందర్య మాట్లాడుతుంది.
ఈ సీన్ గురించి, ఈ మూవీ గురించి సౌందర్య మాట్లాడుతూ, తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటని చెప్పింది. తనకు ఇదొక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చిన మూవీ అని తెలిపింది సౌందర్య.
సౌందర్య యొక్క అనుభవాలు మరియు చిత్రం యొక్క ప్రభావం
`శ్రీరాములయ్య` మూవీలో తాను మొదటిసారి వృద్ధురాలి పాత్రని పోషించానని, అది తనకు కొత్త అనుభావాన్ని ఇచ్చిందని చెప్పింది సౌందర్య.
మొదటి సీన్లో దాదాపు 30వేల మంది జనాలు ఉంటారు. ఆ సీన్లో తాను జనాలను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిందట. ఆ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడినట్టు తెలిపింది సౌందర్య. దర్శక, నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో ఆ సీన్ చేశానని తెలిపింది.
ఇక ఇందులో తనని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే సీన్, మరోవైపు ఫ్యామిలీ అందరితో సరదాగా ఉండే సీన్లు ఎంతగానో నచ్చాయని, వాటిలో బాగా ఎంజాయ్ చేశానని తెలిపింది సౌందర్య.
పాటల్లో అన్ని పాటలు బాగా నచ్చాయని కాకపోతే `గడియ గడియల్లో` పాట మనకు దగ్గరైన పాటగా తెలిపింది సౌందర్య. ఈ మూవీ విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది . అదిప్పుడు వైరల్గా మారింది.
‘శ్రీరాములయ్య’ చిత్రం సౌందర్యకు ఒక విశేషమైన అనుభవాన్ని అందించింది. 30,000 మంది ప్రేక్షకుల మధ్య ఆమె నటన అభిమానులను మెప్పించింది. ఈ చిత్రం ఆమె సినీ జీవితంలో మర్చిపోలేని సంఘటనగా నిలిచింది.


