
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేదవ్యాస్’ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Key Points
ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం 'వేదవ్యాస్' ఘనంగా ప్రారంభం.
సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ తెలుగు తెరకు పరిచయం.
వీవీ వినాయక్, అనిల్ రావిపూడి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
వేదవ్యాస్ చిత్ర ప్రారంభోత్సవం
తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” ఇవాళ (ఆగస్ట్ 28) హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా ప్రారంభమైంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా వేదవ్యాస్ సినిమాను ఘనంగా ప్రారంభించారు. వేదవ్యాస్ సినిమాను కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.
వేదవ్యాస్ సినిమాతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు” హలో .. కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్” అంటూ బొకే అందించగా ఆమె “థాంక్యూ సర్ ” అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు.
ఈ ముహూర్తపు షాట్కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా మరో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అలాగే, ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
సౌత్ కొరియా నటి తెలుగు తెరకు
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే. వారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేశాం. మేము ఇండస్ట్రీలోకి వచ్చి జర్నీ చేస్తున్నాం” అని అన్నారు.
“కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా చేస్తుండటం, ఆ సినిమా ప్రారంభోత్సవానికి నేను గెస్ట్గా రావడం సంతోషంగా ఉంది. మీ వేదవ్యాస్ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రంతో సౌత్ కొరియా నుంచి టాలీవుడ్కు పరిచయం అవుతున్న హీరోయిన్ జున్ జీ హ్యూన్కి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అని దిల్ రాజు తెలిపారు.
డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. “నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్వీ కృష్ణారెడ్డి గారు అలాగే ఉన్నారు. అంతే ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల కాంబినేషన్లో “వేదవ్యాస్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
దిల్ రాజు, ఇతర ప్రముఖుల పాత్ర
నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు వేదవ్యాస్గా తయారైంది” అని అన్నారు.
“కృష్ణారెడ్డి గారి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి. మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో మూవీ నిర్మిస్తున్నాను” అని నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు.
“రాజకీయ నాయకుడిగా, ఇంజినీరింగ్ కాలేజ్లు నిర్వహిస్తున్న విద్యావేత్తగా, రియల్ ఎస్టేట్ లో వ్యాపారంలోనూ కొనసాగుతున్నాను. కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని పొలిటిషియన్, ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం ‘వేదవ్యాస్’ భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.


