
ఫిల్మ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన సన్నిహిత స్నేహితులతో ఉన్న ఫోటోలతో కూడిన ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
తమన్నా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసింది.
మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, రాషా తధానీతో సహా మరికొందరిని ట్యాగ్ చేసింది.
తమన్నా ప్రస్తుతం 'వీవీఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' చిత్రంలో నటిస్తోంది.
తమన్నా ఫ్రెండ్షిప్ డే వీడియో వైరల్
ఫిల్మ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసిపోయింది. ఇవాళ (ఆగస్టు 3) ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె స్పెషల్ వీడియో పోస్టు చేసింది. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఫస్ట్ సండేను ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆడల్ట్ ఫ్రెండ్షిప్ బెస్ట్’ అంటూ తమన్నా ఇన్ స్టాగ్రామ్ రీల్ పోస్టు చేసింది.
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం తమన్నా తోటి హీరోయిన్లు మృణాల్ ఠాకూర్ , కాజల్ అగర్వాల్, రాషా తధానీలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. కొత్త రీల్ లో తమన్నా నేరుగా కెమెరాతో మాట్లాడుతూ.. “అడల్ట్ ఫ్రెండ్ షిప్స్ బెస్ట్! నేను మాట్లాడే ప్రతి స్నేహితుడిలానే.. ప్రతి ఫోన్ కాల్ ‘ఐ లవ్ యూ’తో ముగుస్తుంది. ప్రతి ఫోన్ కాల్ మీరు ఎలా ఫీలవుతున్నారో అనే దాని గురించే ఉంటుంది. పాఠశాల, కళాశాలలో బెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారనేది అపోహ. పెద్దల స్నేహాలే ఉత్తమమైనవని నా అభిప్రాయం!” అని పేర్కొంది. ఆ సమయంలోనే వీడియోలో తన ఫ్రెండ్స్ తో ఉన్న ఫొటోలు డిస్ ప్లే అయ్యాయి.
స్నేహితులతో తమన్నా అనుబంధం
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తమన్నా పెట్టిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో మృణాల్, కాజల్, రాషాతో పాటు ఆమె స్నేహితులు దిశా అజ్వానీ, నిష్కా లుల్లా మెహ్రా, కరణ్ తోరానీ, ప్రగ్యా కపూర్, దర్శన్ ఖత్వానీలను కూడా ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ పై స్పందించిన కాజల్ అగర్వాల్ ‘అయ్యో ఐ లవ్ యూ’ అంటూ ఓ స్వీట్ కామెంట్ పెట్టింది. ‘హ్యాపీ ఫ్రెండ్షిప్స్ డే మై డియర్ టాము. ఐ లవ్ యూ నువ్వు నన్ను ఏడిపించబోతున్నావు’ అంటూ రాషా తధానీ ట్వీట్ చేసింది. ‘ఏడిపించేశావ్’ అని ఇన్ స్టాగ్రామ్ లో మృణాల్ కామెంట్ చేసింది.
తమన్నా తాజా సినిమా వివరాలు
తమన్నా చివరిగా థ్రిల్లర్ డ్రామా సికందర్ కా ముకద్దర్ లో నటించింది. స్త్రీ 2లో, ఆజ్ కీ రాత్ అనే చార్ట్ బస్టర్ సాంగ్ లో కూడా నటించింది. తమన్నా ప్రస్తుతం వీవీఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ చిత్రంలో నటిస్తోంది. దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా నటించారు. మధ్య భారతదేశంలోని దట్టమైన, పౌరాణిక ప్రాంతాలలో సెట్ చేయబడిన వీవీఎన్ భారతీయ జానపద కథలు, దేవాలయాల రహస్యాలతో సాగుతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా ఇది రూపొందుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 15న విడుదల కానుంది.
తమన్నా ఫ్రెండ్షిప్ డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె స్నేహితుల స్పందనలు ఆమె స్నేహాలకు అద్దం పడుతున్నాయి. తమన్నా సినిమాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


