
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన తమన్నా, తాజా ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పెళ్లి రూమర్ల గురించి మాట్లాడింది. అబ్దుల్ రజాక్ మరియు విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధంపై ఆమె స్పష్టతనిచ్చింది.
Key Points
తమన్నా తనపై వచ్చిన పెళ్లి రూమర్స్ గురించి స్పందించింది.
అబ్దుల్ రజాక్ తో కలిసి ఫోటో దిగడంతో పెళ్లి వార్తలు వచ్చాయని తెలిపింది.
విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని, కేవలం ఒక్కసారి మాత్రమే కలిసిందని చెప్పింది.
ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తాయని పేర్కొంది.
పెళ్లి రూమర్స్పై తమన్నా స్పందన
మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా . తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది . టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ .. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు . ఈ ఏడాదిలో ఓదెల -2 మూవీతో అభిమానులను పలకరించింది . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది . ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది . ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది .
గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది . ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది . ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది . తనకు కేవలం అబ్దుల్ రజాక్ తో మాత్రమే కాదు .. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది . నా జీవితంలో విరాట్ ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది . ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా , బాధగా అనిపిస్తుందని పేర్కొంది . ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది .
అబ్దుల్ రజాక్తో తమన్నా సంబంధం?
విరాట్ కోహ్లీతోనూ రూమర్లు?
తమన్నా ఈ రూమర్ల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను, అవి తనకు ఎంత బాధ కలిగించాయో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ వార్తలు ఎంతో కాలం ఆమెను వేధించాయని తెలుస్తుంది.


