
📌 Key Points
- దేవాదాయ శాఖలో 190 కొత్త ఈవో పోస్టులకు తెలంగాణ సర్కార్ ఆమోదం.
- ఆలయాల పాలన, పారదర్శకత మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం.
- భక్తుల రద్దీ, ఆదాయ వృద్ధి నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం.
- త్వరలో నియామక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం.
తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల పరిపాలనను మెరుగుపరచడానికి, పారదర్శకతను పెంచడానికి కొత్తగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టులను మంజూరు చేసింది. ఈ చర్య భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సహాయపడుతుంది.
పోస్టుల మంజూరుకు గల కారణాలు
Telangana Temple Executive Officers : రాష్ట్రంలోని దేవాలయాల పరిపాలన, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో పోస్టులను మంజూరు చేసింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వివిధ గ్రేడ్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 190 పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు.
జోన్ల వారీగా ఈవో పోస్టుల కేటాయింపు
రాష్ట్రంలోని 7 జోన్ల వారీగా పోస్టుల కేటాయింపును పరిశీలిస్తే…. అత్యధిక దేవాలయాలు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా భక్తుల రద్దీ పెరగడం, ఆలయాల ఆదాయం వృద్ధి చెందడంతో పరిపాలనలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అనేక దేవాలయాల్లో ఇన్-ఛార్జ్ అధికారులతోనే పనులు నడుస్తుండటంతో భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం…. కొత్తగా 190 పోస్టులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
భర్తీ ప్రక్రియ, భవిష్యత్ ప్రణాళిక
ఈ పోస్టుల భర్తీ ద్వారా ప్రధాన దేవాలయాల్లో పూర్తిస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. తద్వారా ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వ్యయాల ఆడిటింగ్, పండుగల నిర్వహణ, భక్తులకు అందే సేవల్లో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ లేదా నియామక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ 190 ఈవో పోస్టుల భర్తీతో తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో పరిపాలన మరింత పటిష్టమవుతుంది. ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయ వ్యయాల ఆడిటింగ్, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.


